మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్పై మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.ఎన్ఆర్ఐ హాస్పటల్ ఛైర్మన్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రని బెదిరించారనే అభియోగంపై ఆలపాటి రాజేంద్రప్రసాద్పై 506, 448, 170/2020 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనూ ఎన్ఆర్ఐ ఆసుపత్రి యాజమాన్యంలోని వ్యక్తుల మధ్య వివాదాలు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లాయి. తాజాగా ఎన్ఆర్ఐలో ఒక భాగస్వామిగా ఉన్న ఆలపాటి రాజా ఛైర్మన్ను బెదిరించారనే ఆరోపణలపై కేసు నమోదైంది. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్ విషం
ఎన్నికల్లో ప్రజలు మూతి మీద కొట్టినట్లు జవాబిచ్చినా వైసీపీ అధినేత జగన్ తీరు...