చట్టంతో నాకేం పని… !
రాజ్యాంగం, చట్టంతో నాకేం పని….! న్యాయస్థానాలు .. న్యాయమూర్తులు అంటే ఐ డొంట్ కేర్ …..!! రాష్ట్రపతి, సుప్రీం చీఫ్ జస్టిస్, లోక్ సభ స్పీకర్ వంటి అత్యున్నత స్థాయి పదవులా అతని దృష్టిలో నాన్సెన్స్… వయసులో చిన్నపెద్ద తేడా లేదు … జగన్ రెడ్డే ఆయన దేవుడు … ఇది పంచ్ ప్రభాకర్ రెడ్డి అనే నీచ, నికృష్ట దౌర్భగ్యుడి ఉద్దంతం! ఈ ప్రభాకర్ రెడ్డి పేరు చెబితే బురదలో పొర్లాడే పంది కూడా అసహ్యించుకుంటుంది.. అది ఈ అష్ట దరిద్రుడి స్టోరీ…! పంచ్ ప్రభాకర్ అలియాస్ పాకీ ప్రభాకర్ అని ఏపీ ప్రజలతో పిలుపించుకునే ఇతగాడు … నోరు తెరిస్తే పచ్చి బూతులు .. అచ్చతెలుగు బండబూతులకు అధ్యక్షుడు కూడా! జగన్ రెడ్డి, అధికారపార్టీని ఎవరైన విమర్శిస్తే చాలు .. తాగి కారులో తిరుగుతూ .. సోయి లేకుండా తన సోషల్ మీడియాలో బూతుల దండకాన్ని అందుకుంటాడు. జగన్ రెడ్డి కి అనుకూలంగా తీర్పులివ్వకుంటే.. న్యాయమూర్తులను, న్యాయస్థానాలను కించపర్చేలా హేళన చేస్తూ బూతులు వర్షాన్ని కురిపిస్తాడు. ఇతగాడి వల్గర్ లాంగ్వేజ్ కు బాధించబడిన వారు లిస్ట్ తీస్తే చాంతాండు కూడా సరిపోదు. ఆ మధ్య పిచ్చి పరాకాష్టకు చేరి.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వంటి రాజ్యాంగబద్ధ పదవీల్లో కొనసాగుతున్న వీరిని కూడా వదలకుండా తిట్టడం మొదలు పెట్టారు. దీంతో ఢిల్లీ లో రెండు సెక్షన్ల కిందా కేసు, ఏపీ హైకోర్టు డైరెక్షన్లో మరో కేసు .. ఇలా కేసులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు ను సీబీఐకి అప్పగించింది. అమెరికాలో ఉన్నాను .. నన్నే ఏం పీకుతారని అని అపోహపడుతున్న పంచ్ పాకీకి చెక్ పెట్టేందుకు రంగ సిద్ధమైంది. ఈ నెల 22న కేసు పురోగతి, అరెస్ట్ కు సంబంధిచింన వివరాలను హైకోర్టులకు తెలపనున్నది సీబీఐ. చట్టం ఎవరికి చుట్టం కాదు అన్న తత్వం బోధపడకనే మనోడికి వేషాలు ఇంకా … వెర్రితలలేస్తునే ఉంది!
నవంబర్ -22 ‘పంచ్’కు డెడ్లైన్!
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థలను కించపర్చేలా తన యూట్యూబ్ చానెల్లో అసభ్యక పోస్టుల పెట్టే పంచ్ ప్రభాకర్ ను పట్టుకునేందు సీబీఐ రంగం సిద్ధం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా 53 మొబైల్ నంబర్ల కాల్ డిటేయిల్స్ ను సేకరించింది. పంచ్ వాడిన సామాజీక మాధ్యమాల నుంచి మరింత సమాచారాన్ని ‘ఎంఎల్ఏటీ’ ద్వారా సేకరిస్తున్నట్లు వెల్లడింది. ఏపి న్యాయమూర్తులపైనా, హైకోర్టు పై సోషల్ మీడియాలో పంచ్ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యాలు, పోస్టులపై ఇంచార్జి రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) దాఖలు చేసిన వ్యాజ్యంపై సంగతి తెలిసిందే. దర్యాప్తు చేస్తున్న సీబీఐకి హైకోర్టు ధర్మాసనం గతంలో తలంటి, వార్నింగ్ కూడా ఇచ్చింది. అరెస్ట్ చేయలేకపోతే చెప్పండి.. సిట్ ఏర్పాటుచేసి ఎలా అరెస్ట్ చేసి తీసుకురావాలో తెలుసని హెచ్చరించింది. నవంబర్ 22 వాయిదా సమయానికి పంచ్ ను పట్టుకోకుంటే సీబీఐ డైరెక్టర్ ను కోర్టు పిలిచి, తరువాత ప్రొసిజర్ ప్రకారం సిట్ ఏర్పాటు చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం నవంబరు 3న పేర్కొన్న విషయం విదితమే.