దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ఢిల్లీలో ప్రకటించారు. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సీరం ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరచిన కోవిషీల్డ్ టీకాకు కేంద్రం అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సీరం సంస్థ పది కోట్ల టీకాలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్ల డ్రైరన్ ను ఇవాళ దేశ వ్యాప్తంగా 116 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో నిర్వహించిన డ్రైరన్ ను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పరిశీలించారు. కోవిడ్ టీకా ఉచితం ఢిల్లీకే పరిమితమా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, దేశమంతా కరోనా టీకా ఉచితంగా అందిస్తామని ఆయన ప్రకటించారు.
ధరతో పనిలేదు
ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రకటించడంతో ఇక టీకా ధరపై నెలకొన్న అనుమానాలకు తెరదించినట్టయింది. కేంద్రమే సీరం సంస్థ నుంచి టీకా కొనుగోలు చేసి అందరికీ ఉచితంగా వేయాలని నిర్ణయించింది. దీంతో రెండు డోసుల టీకాకు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన పడాల్సిన పనిలేకుండా పోయింది.
వారంలో టీకా
మరో వారంలో మనదేశంలో టీకా కార్యక్రమం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశీయంగా సీరం సంస్థ తయారు చేసిన టీకాకే కేంద్రం మొగ్గుచూపింది. మరో వారంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకా కోవాగ్జిన్ కు కూడా అనుమతులు లభిస్తే ఇక దేశీయంగా టీకా ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగనుంది.
#WATCH | Not just in Delhi, it will be free across the country: Union Health Minister Dr Harsh Vardhan on being asked if COVID-19 vaccine will be provided free of cost pic.twitter.com/xuN7gmiF8S
— ANI (@ANI) January 2, 2021