కొత్తరకం కరోనా కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. వాటిని గుర్తించడం ఒక సవాలుగా మారింది ప్రభుత్వానికి.. కొత్తగా వస్తున్నవారి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా.. గతంలో వచ్చిన వారిని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అంతేకాదు..యుకే నుంచి వస్తున్న వారిని కూడా ఎక్కడికక్కడ టెస్టులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితులను అదుపు చేయడానికి కేంద్రం సరికొత్త నిబంధనలను విడుదల చేసింది. యుకే నుంచి రావాలనుకునే ప్రయాణికులు ఈ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
- యుకే నుండి భారత్కు బయలుదేరడానికి 72 గంటల ముందు ప్రతి ఒక్కరు వాళ్ల ట్రావెల్ హిస్టరీ నమోదు చేస్తూ.. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని భారత ప్రభుత్వానికి సంబంధించిన newdelhiairport.in వెబ్ సైట్లో నమోదు చేయాలి.
- భారత్కు బయలుదేరడానికి72 గంటల ముందు RT-PCR టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ ను వెబ్ సైట్లో పొందుపరచాలి లేదా వారితో పాటు తీసుకుని రావాలి. అందులో నెగిటివ్ వచ్చిన వారు మాత్రమే ప్రయాణానికి అర్హులు.
- అక్కడి యుకే ఎయిర్ లైన్స్ కూడా నెగిటివ్ రిపోర్ట్ అందుకున్న వారిని మాత్రమే ఫ్లైట్ ఎక్కడానికి అనమతించేలా చర్యలు చేపట్టాలి.
- యుకే నుండి భారత్కి చేరుకన్న ప్రతి ఒక్క ప్రయాణికుడు తమ సొంత ఖర్చుతో RT-PCR టెస్ట్ చేయించుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది. అంతేకాదు.. వాటి ఫలితాలు అందుకునేంత వరకు ప్రయాణికుడు ఎయిర్ పోర్టు దాటి వెళ్లడానికి వీలు ఉండదని కూడా చెప్పుకొచ్చింది.
- ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. వారికి దేశ నిబంధనలను తెలియజేసే విధంగా వాలంటీర్లను అందుబాటులో ఉండేలా ఎయిర్ పోర్ట్ పరిధిలో ఏర్పాట్లు చేయాలి.
- RT-PCR టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వారిని ఆ రాష్ట్రం దాటి వెళ్లకుండా ఐసోలేషన్ సెంటర్కు తరలించి వారి రక్త నమూనాలను ల్యాబ్ పంపే ఏర్పాట్లు చేయాలి. అది మమూలు కరోనానా లేదా కొత్తరకం స్ట్రెయినా అనేది గుర్తించి కేంద్రానికి నివేదిక అందించాలి. ఈలోగా వారికి ఐసోలేషన్లో చికిత్స అందించాలి.
- పాజిటివ్ వచ్చిన వారికి సంబంధిత చికిత్స అందించిన మీదట.. 14 రోజుల తర్వాత తిరిగి టెస్ట్లు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే అక్కడి నుండి పంపంచే ఏర్పాట్లు చేయాలి. వారి ఎక్కడి వారో నమోదు చేసుకుని.. అక్కడి ఆరోగ్య కేంద్రానికి ఈ వ్యక్తి వివరాలు తెలియజేసి పర్యవేక్షించాలా ఏర్పాట్లు చేయాలి.
- చికిత్స తర్వాత కూడా ఆ వ్యక్తి కనీసం 7 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ పాటించేలా అక్కడి స్థానికి ఆరోగ్య అధికారులు చర్యలు చేపట్టాలి.
- ఒకవేళ ఎయిర్ పోర్ట్ టెస్టులలో నెగిటివ్ వచ్చిన వారు కూడా 14 రోజుల పాటు ఐసోలేషన్ పాటించాలి. అందుకు స్థానిక అధికారులు తగిన చర్యలు చేపట్టాలి.
- ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఎయిర్ పోర్ట్లలో.. యుకే నుంచి వస్తున్న ప్రయాణికుల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలి. అందులో టెస్ట్ల వివరాలు, పాజిటివ్ వచ్చిన వారు.. నెగిటివ్ వచ్చిన వారు.. ఇలా సవివరంగా నివేదిక ఉండేలా చూడాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.