ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు చంద్రబాబు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎప్పటి నుంచి దాన్ని అమల్లోకి తేవాలనే దానిపై స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖ ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ అంశంపై స్పష్టత ఇస్తూ కేంద్ర హోం శాఖకు తాజాగా తిరుగు లేఖ పంపారు.
ఈ లేఖలో, 2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో చేర్చాలని కోరారు చంద్రబాబు. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొనడం సబబుగా ఉంటుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి తెలిపారు. దీని ఆధారంగా కేంద్ర హోం శాఖ కేబినెట్ నోట్ తయారుచేసి, మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. డిసెంబర్ చివరివారానికల్లా కేబినెట్ ఇందుకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చట్టసవరణ బిల్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల ముందుకు రావొచ్చని తెలిసింది.
చంద్రబాబు లేఖతో వైసీపీలో వణుకు మొదలైంది. అమరావతిని కేంద్ర ప్రభుత్వం రాజధానిగా గుర్తిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఫేక్న్యూస్కు తెరలేపింది. బ్లూ మీడియా సాక్షిలో తప్పుడు కథనాలు వండి వార్చింది. అమరావతి బిల్లు ఆగిపోయిందని వార్తలు రాసి రాక్షసానందం పొందారు వైసీపీ నేతలు. తాజాగా ఈ అంశంపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అమరావతికి రాజధాని హోదా 2014 నుంచి ఇవ్వాలా? 2024 నుంచి ఇవ్వాలా? అన్న సాంకేతిక అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం స్పష్టత అడిగిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన సమాధానం ఇవ్వడంతో త్వరలోనే అమరావతికి రాజధాని హోదా దక్కుతుందన్నారు.
గతంలో అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన కుట్రలు అన్నీఇన్ని కావు. 3 రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు జగన్. కానీ తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలిచినట్లు 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం పాలయ్యారు. ఇప్పుడు అమరావతి పూర్వ వైభవం సంతరించుకుంది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు రాత్రింబవళ్లు జరుగుతున్నాయి. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో కొలువుదీరుతున్నాయి. ఇటీవల 16 జాతీయ సంస్థల నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు











