బాలు ఆరోగ్యం విషయంలో భిన్న వార్తలు వెలువడుతున్నాయి. ఆయనకు కరోనా నెగిటివ్ అని ఓ పక్క ప్రచారం జరుగుతుంటే మరో పక్క లేదు లేదు అని మరో పక్క వార్త. దాంతో ఏది నిజయో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఉంది. కరోనాతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందని ప్రకటించారన్నట్లు వార్త వైరల్ అయ్యింది. బాలు కోలుకుంటున్నారని కూడా ప్రకటించడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ అది ఎంతో సేపు పట్టలేదు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజా ప్రకటన విడుదల చేశారు. కరోనా పరీక్షల్లో తన తండ్రికి నెగిటివ్ వచ్చిందని తనెక్కడా తెలుపలేదని అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరిన్ని వివరాలు తెలుపుతామన్నారు. బాలు ఆరోగ్యానకి సంబంధిించి ఏ వార్త అయినా తన నుంచి వెలువడే వరకు దేన్నీ నమ్మవద్దని చరణ్ కోరారు.
తేలిపోతున్న జగన్ ప్రసంగం..!! అసలు ఆ అంశాల ప్రస్తావనేదీ..??
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ...