తెలుగుజాతికి ప్రియమైన అన్న నందమూరి తారక రాముని వర్ధంతి సందర్భంగా.. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తనయుడు, నందమూరి తారక రామారావుకు మునిమనమడు నారా దేవాన్ష్ కూడా శ్రద్ధాంజలి ఘటించడం పలువురిని ఆకట్టుకుంది.
తాతయ్య నారా చంద్రబాబునాయుడు, నాన్న లోకేష్ తో కలిసి దేవాన్ష్ కూడా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. ముత్తాతకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారితో పాటు అక్కడ కాసేపు కూర్చున్నారు. అలాగే.. లోకేష్ తనను ఎత్తుకోగా.. ఎన్టీఆర్ సమాధిపై పూలు చల్లి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా.. ముత్తాతకు మునిమనవడి భక్తిపూర్వక శ్రద్ధాంజలి అంటూ పలువురు మాట్లాడుకోవడం విశేషం.
Must Read ;- ఎన్టీఆర్ మరణానికి కారణం యనమల రామకృష్ణుడా?











