మాజీ మంత్రి దేవినేని ఉమా విశాఖలో108ఎకరాలు ఆక్రమించిన ఫార్మాకంపెనీ వెనుక పెద్దలుఎవరు? అంటూ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రభుత్వం మారగానే ఫార్మా కంపెనీకి అన్నీ అనుమతులు ఎలా వచ్చాయంటూ ఆయన ప్రశ్నించారు. భూములిచ్చేది లేదని 4గ్రామాలంటున్నా ఎకరా50లక్షలు చేసేభూమిని18లక్షలకే అధికారులు ఎలాకేటాయిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావసరాలకు ఉపయోగించే భూములను ఆక్రమించుకున్న సంస్థపై ఏంకేసులుపెట్టారోచెప్పండి అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు.
‘వడ్డించే వాడు మన వాడైతే మనకు అన్నీ అందుబాటులోకి వస్తాయి’ అనే సామెత అందరికి తెలిసే ఉంటుంది. అలాగే ‘అధికారంలో ఉన్నది మన వారయితే’ ఆడింది ఆట పాడింది పాటగా సాగవచ్చు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటైన హెటిరో సంస్థ విషయంలో ఈ విషయం రుజువయింది. మొదట 200 ఎకరాలలో ఈ సంస్థ తమ కార్యక్రపాలను స్థాపించింది. ఆ తరువాత 400 ఎకరాలకు విస్తరించింది. మరో 50 ఎకరాలు కావాలని గత ప్రభుత్వానికి ఈ కంపెనీ విజ్ఞప్తి చేసింది. అందుకు ఒప్పుకొని గత ప్రభుత్వం ఆ లాండ్స్ ను స్వాధీనం చేసుకోమని రెవిన్యూ అధికారులను ఆదేశించింది. దాంతో ఆ కంపెనీ సైలెంట్ అయింది.
తమకు అనుకూలమైన పార్టీ అధికారం లోకి రాగానే ఆ కంపెనీ తిరిగి అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. ఈ సారి 50 ఎకరాల కోసం కాదు 108 ఎకరాల కోసం ఆ కంపెనీ అనుమతుల కోసం ట్రై చేయడం గమనార్హం. ఈ 108 ఎకరాలలో పశువుల బీడలు, చెరువులు, శ్మశానాలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిశ్రమ నుంచి వస్తున్న వ్యర్థ పదార్దాలతో దుర్గంధం వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ చుట్టు ప్రక్కల గ్రామస్థులు పశువుల బీడలను కూడా పరిశ్రమలకిస్తే తమ పశువులను ఎక్కడ మేపాలని ప్రశ్నిస్తున్నారు. వారికి ఎట్టి పరిస్థితులలో తమ భూములు ఇచ్చేది లేదని నాలుగు గ్రామల ప్రజలు నిర్ణయం తీసుకోవడం విశేషం.
దీంతో పరిస్థితి చేయిజారిపోతుందనే ఉద్దేశంతో కంపెనీ ప్రతినిధులు గ్రామ పంచాయితీ తీర్మానాల ద్వారా కథను నడిపించారు. దీంతో చాలా స్థలాలు ఈ పాటికే ఆ కంపెనీకి బదలాయింపు జరిగిపోయిందని తెలుస్తోంది. హెటిరో కంపెనీ 108 ఎకరాల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకుందని జాయింట్ కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఇప్పటికే గ్రామ పంచాయితీల తీర్మానాలు తీసుకున్నామని ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో అనుమతులు ఇవ్వకుండా తమ బాధను అర్ధం చేసుకోవాలని ఆ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.