జగన్ రెడ్డి పాలనలో ఏపీలో ఉన్న హిందువుల మనోభావాలు మంట కలిసిపోతున్నాయి. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నా.. చెవిటి ముందు శంఖం మాదిరిగా తన పని తాను చేసుకుంటూ అదే వైకరిని అవలంబిస్తున్నారు.
ఏపీలో జగన్ రెడ్డి పాలనలో వందల కొద్ది హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. కానీ నో రెస్పాన్డ్. దాదాపు పదుల సంఖ్యలో దేవుడి రథాలు, విగ్రహాలు ద్వంసం అయ్యాయి. నో రెస్పాన్డ్. హిందూ మతాచరాలను మంట గల్పేలా అనేక వ్యతిరేక కార్యకలపాలు రాష్ట్రంలో జరుగుతున్నా.. నో రెస్పాన్డ్. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నా .. అన్నీ ఆలయాలపై ఈ నాలుగునరేళ్ళ అనేక దాడులు జరిగినా..జరుగుతున్నా.. జగన్ రెడ్డి ఏనాడు బయటకు వచ్చి.. దానిపై చిన్న స్టేట్మెంట్ కానీ.., చర్యలు గానీ తీసుకున్న పాపన పోలేదు. ఒక్క అరెస్ట్ కూడా కనీసం చూద్దామన్నా.. అదీ లేదు.
తిరుమలలో వైదిక సాంప్రాదాయం దెబ్బతీసేలా అక్కడ పాలక మండలి.., అధికారులు చేస్తున్న కార్యక్రమాలు తరుచూ భక్తుల ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా ఉన్నా.. దానిపై పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన అంక్షాలు.. అన్నీఇన్నీ కావు. దేవదేవుడి దర్శనం ఐనోళ్ళకే అన్న రీతిని టికెట్ ధరలను అమాంతం పెంచి పేదలకు.., మధ్య తరగతి కుటుంబాలకు ఆ భాగ్యం దూరం చేశారు. అన్యమతస్తులకు శ్రీవారి దేవస్ధానంలో కీలక పదవులు ఇచ్చి.. హిందూ మతంపై నిత్యం దాడులు చేయిస్తున్నారని జగన్ రెడ్డి ప్రభుత్వంపై, టీటీడీ పాలక మండలిపై భక్తులు మండిపడుతున్నారు. హిందూ ధార్మిక సంఘాలు.., మత గురువులు నిత్యం తిరుమల కొండపై జరిగే అన్యామత ప్రచారాన్ని సాక్ష్యాలతో చూపుతున్నా.. దున్నపోతుపై వాన మాదిరిగా జగన్ రెడ్డి వైకరి ఉండటం శోచనీయం.
అలానే తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానం పథకాన్ని సైతం భ్రష్టుపట్టించింది టీటీడీ పాలక వర్గం. దీనిపై వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులు నిరసన వ్యక్తం చేశారు. వడ్డీంచే అన్నం బాగాలేదని.. భక్తులకు ఇలాంటి అన్నంపెడతారా..? అంటూ సిబ్బందిని నిలదీశారు. దీనిపై ఉన్నతాధికారులు వచ్చి.. సమాధానం చెప్తేనే దీన్ని వదిలేస్తామని.. లేకుంటే ధర్నాకు దిగుతామని భక్తులు హెచ్చరించారు. 1985 లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు ఆదేశాలు మేరకు తిరుమలలో శ్రీ వెంగమాంబ భవన సముదాయంలో ప్రారంభించిన ఈ పథకాన్ని నేడుర జగన్ రెడ్డి ప్రభుత్వం నీరుగారుస్తోంది. దశాబ్ధాలుగా ఇటువంటి పరిస్ధితిని ఎన్నడూ చూడలేదని భక్తులు వాపోతున్నారు.
ఇలా తిరుమలలో అడుగడుగునా ప్రభుత్వం.., పాలక మండలి నిర్లక్ష్యం కళ్ళకడుతున్న ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి నుంచి ఎటువంటి స్పందనను ఈ నాలుగురనరేళ్ళల్లో రాష్ట్ర ప్రజలు చూడలేదు. హిందూ ఓటు బ్యాంకుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్ రెడ్డి అన్యమతస్తుడు. కాబట్టే హిందూ సాంప్రాదాయం, ఆచారాలు, సంప్రదాయాలు, మనోభావాలు ఆయనకు తెలియవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు











