సగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను మళ్ళీ రాజమహేంద్రవరం తరలించారు.కరోనా సోకటంతో విజయవాడలోని ఆయుష్ ఆప్పత్రిలో ఆయన చికిత్స చేయించుకున్నారు. తాజా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్ రావడంతో ఏసీబీ అధికారులు రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలుకు తరలించారు.ఆయుష్ వైద్యుల సూచనల మేరకు నరంద్రను వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా,నరేంద్ర తరఫు న్యాయవాదులు ఆయనకు బెయిల్ మంజూరు కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..
ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉంటే.....











