బాలీవుడ్ లో కియారా అద్వానీ టాప్ మోస్ట్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. వచ్చిన ప్రతీ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకొని.. ఇప్పుడు హైయస్ట్ రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం పలు చిత్రాల్ని లైన్ లో పెట్టుకున్న అమ్మడు.. మరో పక్క సౌత్ సినిమాలనుంచి కూడా భారీ ఆఫర్స్ అందుకుంటోంది.
‘భరత్ అనే నేను ,వినయ విధేయ రామ’ లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది కియారా. ఆకర్షించే అందానికి తోడు, ఆకట్టుకునే అభినయం కూడా యాడవడంతో ఆమెకు టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే.. టాలీవుడ్ లో కూడా బాలీవుడ్ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తుండడం దర్శక నిర్మాతలకు భారంగా మారింది.
ప్రస్తుతం సౌత్ సినిమాల కోసం కియారా డిమాండ్ చేస్తున్న పారితోషికం అందరికీ షాకింగ్ గా మారింది. అమ్మడు రూ. 3కోట్లు పారితోషికం కోట్ చేస్తోందట. దాంతో ఆమెను ఎంపిక చేయాలా వద్దా అనే సంశయం లో ఉన్నారు దర్శక, నిర్మాతలు. యన్టీఆర్ ,కొరటాల శివ సినిమా కోసం కియారా సరిగ్గా అంతే డిమాండ్ చేసిందట. ప్రస్తుతం దర్శక, నిర్మాతలు ఆమెతో బేరసారాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. మరి కియారా యన్టీఆర్ 30కోసం పారితోషికం విషయంలో ఒక మెట్టు దిగి వస్తుందా లేక ఆఫర్ వదులు కుంటుందా అనేది చూడాలి.