అధికార పార్టీతో అంటకాగి… అధికార పార్టీ నేతలు చెప్పినట్టు విని… ఆపై వారిచ్చిన వెసులుబాటును క్యాష్ చేసుకున్న ఓ పోలీస్ అధికారి పరిస్థితి ఎలా ఉంటుందో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ ను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. గత వైసీపీ జమానాలో నాటి సీఎం జగన్, ఇతర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా సంజయ్ వ్యవహరించారు. చట్టాన్ని పక్కనపెట్టేసి… అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా పనిచేసుకుంటూ వెళ్లిపోయారు. సీనియర్ రాజకీయవేత్త, ఏకంగా 3 పర్యాయాలు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయమనగానే… ముందూవెనుకా చూసుకోకుండా అరెస్ట్ చేశారు. ఆపై కోర్టు మొట్టికాయలతో పాటుగా ఇప్పుడు ఆయన ఏకంగా జైలుకు వెళ్లక తప్పని పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. విధి నిర్వహణలో సంజయ్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్లుగా ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ తేల్చేసింది. ఆ నివేదికను ఆధారం చేసుకుని సంజయ్ ప చర్యలకు రంగం సిద్ధమైపోయింది.
సీఐడీ చీఫ్ గా ఉన్న పమయంలో ఎస్సీ, ఎస్టీలకు చట్టాలప అవగాహన కోసమంటూ నాటి జగన్ సర్కారు రూ.1.18 కోట్లను కేటాయించగా… ఇందులో నామమాత్రంగానే ఖర్చు చేసిన సంజయ్… కోటి రూపాయలకు పైగా తన జేబుటో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అగ్నిమాపక ాఖ డీజీగా ఉన్న సమయంలో ఆయా కంపెనీలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీని కంప్యూటరీకరణ చేస్తామమంటూ సంజయ్ సృష్టించిన కంపెనీ ముందుకు రాగా.. దానికి కూడా ఆయన ఏకంగా రూ.59 లక్షల మేర బిల్లులు చెల్లించేశారు. పని చేయకుండానే సదరు సంస్థకు బిల్లుల చెల్లింపు కోసం సంజయ్ సంబంధిత అదికారులపై ఒత్తిడి తీసుకువర్చారని కూడా విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతో విజిలెన్స్ విచారణ నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై విచారణ చేయాలంటూ అవినీతి నిరోధక శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ పై విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి అవసరం కాగా… సంజయ్ పై విచారణకు అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే సీఎస్ కు ఏసీబీ లేఖ రాసింది. సంజయ్ పై విచారణకు సీఎస్ అనుమతి ఇవ్వడం లాంఛనమేనని చెప్పక తప్పదు. అంటే… నేడో, రేపో ఏసీబీ అధికారులు సంజయ్ పై విచారణను మొదలుపెట్టడం ఖాయమేనన్న మాట.
ఇక ఏసీబీ విచారణలో పెద్దగా తేలేదేమీ లేదనే చెప్పాలి. సీఐడీ చీఫ్ గా ఉన్నప్పుడు సంజయ్ చేసిన నిధుల దుర్వినియోగం, ఫైర్ డీజీగా ఉన్న సమయంలో ఆయన తన కంపెనీలకు నిధుల ధారాదత్తం తదితరాలపై ఇప్పటికే విజిలెన్స్ శాఖకు .పక్కాఆధారాలు దొరికిపోయాయి. ఇవే ఆధారాలను ఏసీబీ కూడా తన విచారణకు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. వెరసి సంజయ్ చేసిన నిర్వాకాలకు సంబంధించి ఏసీబీ కొత్తగా తేల్చేదేమీ లేకున్నా… ఓ దర్యాప్తు సంస్థగా ఆయన అవినీతిని కోర్టులో పెట్టనుంది. ఈ ఆధారాలను పరిశీలించనున్న కోర్టు… సంజయ్ ని దోషిగా తేల్చడమే తరువాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే… అతి త్వరలోనే సంజయ్ జైలుకు వెళ్లడం ఖాయమేనని చెప్పక తప్పదు.
ఇప్పటికే విజిలెన్స్ నివేదకతో ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఏసీబీ దర్యాప్తులో సంజయ్ దోషిగా తేలితే… రిటైర్ మెంట్ కు ముందే సంజయ్ ఐపీఎస్ హోదాను కోల్పోవడం తప్పదని చెప్పాలి. అధికార పక్షానికి మడుగులు ఒత్తే ఏ అధికారి అయినా… సంజయ్ ఉదందాన్ని చూసి అయినా నిగ్రహించుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.










