ఐపిఎల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయిన 2010 నుంచి లండన్ లోనే ఉంటున్నారు. ఈ అంశం అప్పట్లో హాట్ టాపిక్ గా మారగా చాలా రోజులు దీనిపై మీడియాలో కథనాలు నడిచాయి. కాగా తాజాగా లలిత్ మోడీ చేసిన ట్వీట్ వైరల్ అవుతుండగా.ప్రస్తుతం ఇదే అంశం మీడియా వర్గాల్లో సెన్సేషన్ గా మారింది.
బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్తో తన పెళ్లి జరగబోతోంది అంటూ లలిత్ మోడీ ట్విటర్ వేదికగా ఒక ప్రకటన చేశారు. అయితే , కొద్ది నిమిషాలకే పెళ్లి కాదు, కేవలం డేటింగ్ మాత్రమేనని మరో ట్వీట్ ద్వారా ఆయన తెలిపారు.అంతేకాదు.. ఏదో ఒక రోజు పెళ్లి కూడా జరిగి తీరుతుందంటూ లలిత్ మోడీ ప్రకటించారు.ఈ క్రమంలో లలిత్ మోదీ చేసిన వరుస ట్వీట్లు ఇటు బాలీవుడ్ వర్గాలతో పాటు అటు క్రీడా ప్రముఖులను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి.
లలిత్ మోదీ పోస్ట్ చేసిన తన తొటి ట్వీట్ లో మాల్దీవులు, సార్డియానా పర్యటనను ముగించుకుని ఇప్పుడే లండన్ తిరిగి వచ్చానని.. ఈ టూర్కు పలు కుటుంబాలతో కలిసి వెళ్లానని.. అయితే ఆయన ఆ కుటుంబాల పేర్లు మాత్రం చెప్పనని ఆయన తెలిపారు.ఇదే ట్వీట్ లో సుస్మితా సేన్ ను తన బెటర్ హాఫ్ గా పేర్కొంటూ.. తన జీవితంలో ఎట్టకేలకు ఒక కొత్త అధ్యాయం మొదలైందని రాసుకొచ్చారు.
ఒకవైపు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కొద్ది నిమిషాలకే లలిత్ మోదీ మరో ట్వీట్ను పోస్ట్ చేశారు. ఇంతకుముందు తాను పోస్ట్ చేసిన ట్వీట్పై క్లారిటీ ఇస్తున్నానని.. ప్రస్తుతం సుస్మితాతో డేటింగ్ మాత్రమే చేస్తున్నానని స్పష్టం చేశారు.అదేసమయంలో ఏదో ఒక రోజున ఆమెతో పెళ్లి కూడా జరిగి తీరుతుందని మోదీ ప్రకటించారు. ఈ ట్వీట్లకు విదేశీ పర్యటనల్లో సుస్మితా సేన్తో తాను సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆయన జత చేశారు.
ఇదిలా ఉంటే సుస్మితా సేన్ గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాల్ తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కొంత కాలం డేటింగ్ లో కూడా ఉన్నారు. అయితే కొన్ని వ్యతిగత కారణాలతో ఇద్దరూ వారి ప్రేమ వ్యవహారానికి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం మోడీ ట్వీట్ లు.. మోడీ, సుస్మితా సన్నిహితంగా దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి వీరి వ్యవహారం డేటింగ్ తో ఆగిపోతుందా ? లేక నిజంగా పెళ్ళి బంధంతో ఇద్దరూ ఒకటవుతారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.