కరోనా కేసులు పెరగుతున్నందున ఏపీ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. రేపటి నుంచి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కులు ధరించకుండా తిరిగితే గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, పట్టణాల్లో రూ.1,000 ఫైన్ వసూలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఈ మేరకు ఫైన్కు సంబంధించిన పుస్తకాలు అందినట్టు పోలీసు అధికారులు తెలిపారు. కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలకూ ఇప్పటికే ప్రభుత్వం పలు చూచనలు చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కూడ అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.
సౌత్ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...










