మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ భూముల్లో అధికారులు సర్వే చేసిన తీరును హైకోర్టు తప్పు పట్టింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు ఉల్లంఘించారని పేర్కొంది. మే1, 2 తేదీల్లో చేసిన విచారణ, మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లవని పేర్కొంది. ఈ నివేదికల ఆధారంగా జమునా హేచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి తగిన సమయంలో రాచ మార్గంలో వెళ్లి సర్వే చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 6వ వాయిదా వేసింది. అధికారులు చట్టవిరుద్ధంగా సర్వే చేసి తాము అసెన్డు భూములు ఆక్రమించామంటూ ఇచ్చిన నివేదికలపై జమునా హేచరీస్ హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేసి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
చేతులు ఎత్తేసిన అవినాష్ రెడ్డి..?? సునీత, షర్మిల విజయం..!!
ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది...