ఆ నియోజకవర్గంలోని అధికార పార్టీలో అసమ్మతి తారా స్థాయికి చేరిందా ? అక్కడి అసమ్మతి సెగ అమరావతిని తాకిందా ? తాడో పేడో పార్టీ పెద్దల దగ్గరే తేల్చుకుందాం అంటున్న ఆ నాయకులు ఎవరు ? నేతల తీరుతో అధిష్టానం చేస్తున్న ఆలోచనలు ఏమిటి ? ఇదే పరిస్థితి కొనసాగితే 2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీకి గడ్డు పరిస్థితులే అనేలా వారు ఏం చేశారు ? ఇంతకీ ఎవరా నేతలు ? వాళ్ళ మధ్య వివాదానికి కారణం ఏమిటి ?
అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీలో నేతల మద్య అసమ్మతి రోజురోజుకూ పెరిగిపోతోంది. స్థానికేతర నేతల పెత్తనం మాకద్దంటన్న స్థానిక నేతల అసమ్మతి సెగ ఏకంగా అమరావతిని తాకింది.పంచాయితీ పార్టీ హైకామండ్ వద్దకు చేరడంతో అధిష్టానం వద్దే తాడో పేడో తేల్చుకుంటామంటూ అసమ్మతి వర్గం ప్రతిజ్ఞ చేసిందని టాక్.దీంతో నియోజిక వర్గం లో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోతుందని ఆవేధన క్యాడర్ నుంచి వ్యక్తం అవుతోంది.
ఎంపీ గోరంట్ల మాధవ్ , ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, ఇతర నాయకుల మధ్య మొదటి నుంచి ఆధిపత్య పోరు నడుస్తోందట. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడం నియోజకవర్గంలో కామన్ అయిపోయిందట. లోకల్ , నాన్ లోకల్ అంశమే వీరి మధ్య వైరానికి కారణమని టాక్.స్థానిక నేతల పై స్థానికేతర నేతల పెత్తనం ఎక్కువైందనే భావన అసమ్మతి వర్గంలో బలంగా నాటుకుపోయిందట. దీంతో అసమ్మతి వర్గం అయిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, వేణుగోపాల్ రెడ్డి మరికొంతమంది స్థానిక కౌన్సిలర్ లను ఇతర నాయకులను తీసుకుని పంచాయితీ పెట్టేందుకు అమరావతి వెళ్లారట. అక్కడ సజ్జలను కలిసిన అసమ్మతి వర్గం తాము అధికార పార్టీలో ఉన్నా తమ మాట చెల్లుబాటు కావడం లేదని.. అసలు తాము అధికార పార్టీలో ఉన్నమా ? ప్రతిపక్షంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారట.
వాస్తవానికి ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి స్థానిక ముఖ్య నాయకులు , మాజీ సమన్వయ కర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతోందట.వీరికి మాజీ ఏమీలయే అబ్దుల్ ఘనీ తోడవ్వగా, పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలు సైతం మహయాండ్ ఇక్బాల్ కు వ్యతిరేకంగా అసమ్మతి స్వరం వినిపించడం మొదలు పెట్టారట.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఇక్బాల్ మాత్రం వీటితో సంబంధం లేదన్నట్లు తానొక్కరే గడప గడపకు మన ప్రభుత్వం ప్రారంభించారట. ఇక ఈ కార్యక్రమాన్ని ఓ నాలుగు రోజుల పాటు మొక్కుబడిగా నిర్వహయిచ్చిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఆ తరవాత విదేశీ పర్యటనకు వెళ్లిపోయారట.ఇదే అదునుగా చూసుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ కార్యక్రమాన్ని తాను నిర్వహిస్తానంటూ హిందుపురంలో పాగా వేశారట. అయితే ఇది అక్కడి నాయకులకు అస్సలు రుచించలేదట.
కాగా ఎమ్మెల్సీ, ఎంపీ మద్య వైరం క్రింద స్థాయి నేతల పై తీవ్ర ప్రభావం చూపిందని స్థానిక వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈ విబేధాలు రాష్ట్ర రాజధాని అమరావతికి చేరాయని.. పార్టీ హై కమాండ్ సైతం ఈ విబేధాలకు చెక్ పెట్టాలనే ఆలోచనతో ఆ బాధ్యతను సజ్జల చేతికి అప్పగించిందట.ఈ నేపధ్యంలో ఎమ్మెల్సీ , ఎంపీ ల మద్య విబేధాలను నివారించేందుకు సజ్జల రెండు మార్లు బహిరంగా చర్చించినా ఫలితం లేకపోయిందని సమాచారం. ఎంపీ గోరంట్ల తీరుపై ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట. ఎమ్మెల్సీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఎంపీ మాధవ్ గడప గడపకు ఎలా నిర్వహిస్తారని సజ్జల దృష్టికి తీసుకెళ్లారట. ఇక ఇక్బాల్ సైతం తన దగ్గర ఉన్న నాయకులతో పడలేకపోతున్నామని సజ్జల వద్ద చెప్పుకొచ్చారట. ఈ క్రమంలో ఇంచార్జ్ బాధ్యతలు స్థానికేతరులకు కాకుండా స్థానీకులకే అప్పగించాలంటూ తమ డిమాండ్ ను సజ్జల ముందు ఉంచారట.కాగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనంతరం సమస్యను జగన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారట.
మరోవైపు సజ్జల సమావేశం తర్వాత కూడా హిందూపురంలో అసమ్మతి వర్గం చల్లబడలేదట. ఎంపీ గోరంట్ల, ఎమ్మెల్సీ ఇక్బాల్ వ్యతిరేక వర్గాలు ఏకతాటిపైకి వచ్చి ప్రత్యే సమావేశాలు నిర్వహించుకున్నారట. ఈ సమావేశం వేదికగా మాకొద్దీ ఖాకీ కడదర్ అనే నినాదంతో ముందుకు సాగాలని డిసైడ్ అయ్యారని టాక్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసి కష్టపడిన మమ్మల్ని పక్కన పెట్టి నాన్ లోకల్ వాళ్ళకి అధికారం కట్టబెట్టడం సరికాదని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. ఇదే పరిస్థితి కొనసాగితే 2024 ఎన్నికల్లో పార్టీ గడ్డు పరిస్థితులు ఎదురుకోక తప్పదని హెచ్చరిస్తున్నారట.
మరి హిందూపురంలో మాకొద్దు ఈ ఖద్దర ఖాకీ అంటూ చెలరేగిన వివాదానికి జగన్ ఏ విధంగా చెక్ పెడతారో వేచి చూడాలి.