న్యూజెర్సీలో భారత దంపతులు అనుమానస్పదంగా చనిపోయారు. మహారాష్ట్ర కు చెందిన బాలజీ భరత్ రుద్రావర్ (32), భార్య ఆర్తి బాలాజీ (30)గా గుర్తించారు. 2015, ఆగస్టులో అమెరికా ఉద్యోగ నిమిత్తం వెళ్లారు. బాలాజీ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఆర్తి ఇంటి దగ్గరే ఉంటుంది. వాళ్లకు ఒక పాప. న్యూజెర్సీలో ఇంటి బాల్కనీలో ఇద్దరు చనిపోయి ఉండటం పలు అనునామాలకు తావిస్తోంది. ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉండడం పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ ఇది హత్య? లేదా ఆత్మహత్య? అనే విషయంపై స్పష్టత రాదని పోలీసులు వెల్లడించారు. అయితే నాలుగేళ్ల కూతురు దిక్కు తోచని స్థితిలో కనిపించడం, భార్య గర్భవతి కావడం… పలువురికి కన్నీళ్లు తెప్పిస్తోంది. మృతదేహాలు స్వదేశానికి రావడానికి 8 నుంచి 10 రోజుల వరకు పడుతుందని సమాచారం.
కడప సాక్షిగా ఒక్కటయిన ఎస్సీ వర్గాలు.. నామినేషన్ రోజే జగన్కి షాక్..!!
కడప జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డికి సహాయ...