క్రికెట్ లోకి వచ్చిన అతి కొద్ది కాలంలో మంచి పేరును సంపాదించుకున్న ఆటగాడు విరాట్ కోహ్లి. అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో ఆనతి కాలంలోనే సచిన్ ను మెప్పించిన క్రికెటర్. ఒకానొక సందర్భంలో సచిన్ సైతం నా తరువాత అంతటి ప్రదర్శన చేయగల ఆటగాడు కోహ్లినే అన్నాడంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం విరాట్ కోహ్లి ఐపీఎల్ మ్యాచ్ లతో బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం అబుదాబీలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. కోహ్లి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ సందర్భంగా కోహ్లికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్బీసీ, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లను చూసేందుకు కోహ్లి భార్య, నటి అనుష్కా శర్మ కూడా అబుదాబీ విచ్చేశారు.
ఈ సందర్భంగా కోహ్లి మ్యాచ్ మధ్యలో ఉండగా తన భార్య అనుష్క వైపు చేతితో సైగ చేస్తూ భోజనం చేశావా అని అడిగారు. దానికి సమాధానంగా అనుష్క తన బొటన వేలితో చేశాను అన్నట్లు సైగ చేశారు. ఆట సంగతి అటు ఉంచితే కోహ్లి తన భార్య పట్ల చూపిస్తున్న కేరింగ్ కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
భార్య అంటే నీకు ఎంత ఇష్టం కోహ్లి అంటూ మహిళ అభిమానులు తెగ ముచ్చట పడిపోతున్నారు. అనుష్కకు కోహ్లి లాంటి భర్త దొరకడం నిజంగా తన అదృష్టమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింటిలోకి వచ్చిన కొద్ది సేపటికే వేల లైక్ లు సొంతం చేసుకుంది.
కోహ్లి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే.
This man is everyone’s favourite and for all the valid reasons @imVkohli @AnushkaSharma
You two are too cute! pic.twitter.com/OlQNF9ypHS— Parminder Singh Brar (@PSBrarOfficial) October 28, 2020