విశాఖ మంచి టూరిస్టు ప్లేస్. అందమైన బీచ్లు, అలరించే ప్రకృతి విశాఖ సొంతం. ఐతే ఇప్పుడు మరో అద్భుతమైన ప్రాజెక్టు విశాఖలో రెడీ అయింది. విశాఖ కైలాసగిరిలో గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. త్వరలోనే ఈ గ్లాస్ బ్రిడ్జిని సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
భారతదేశంలోనే అతిపొడవైన 55 మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ కైలాసగిరి హిల్టాప్ పార్క్లో రెడీ అయింది. ఈ కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్, రూ. 7 కోట్ల వ్యయంతో సముద్ర తీరం తో పాటు విశాఖ నగర అందాలను ఇక్కడి నుంచి చూసి అనుభూతి పొందొచ్చు. ఈ బ్రిడ్జ్, సాహస ప్రియులు , ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
కైలాసగిరి విశాఖపట్నంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక స్థలాలలో ఒకటి. 360 అడుగుల ఎత్తులో ఉంది. ఈ హిల్టాప్ పార్క్, 380 ఎకరాల విస్తీర్ణంలో శివ-పార్వతి విగ్రహాలు, రోప్వే, టాయ్ ట్రైన్, టైటానిక్ వ్యూపాయింట్ వంటి ఆకర్షణలతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఈ కొత్త గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్, టైటానిక్ వ్యూపాయింట్ సమీపంలో రెడీ అయింది.
55 మీటర్ల పొడవుతో, ఈ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ భారతదేశంలోని అతిపొడవైన కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్గా రికార్డు సృష్టించనుంది. కేరళలోని వగమోన్ గ్లాస్ బ్రిడ్జ్ 40 మీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జ్, కింది నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉంటుంది. సందర్శకులకు గాలిలో తేలియాడే అనుభూతిని ఇస్తుంది. నిర్మాణం 2024 అక్టోబర్లో ప్రారంభమైంది. ఈ బ్రిడ్జ్ మీదకు ఒకేసారి 40 మంది వరకు సందర్శకులు వెళ్లవచ్చు.
ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA), RJ అడ్వెంచర్స్ మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద అభివృద్ధి చేశారు. VMRDA టికెట్ అమ్మకాల నుంచి 40 శాతం ఆదాయాన్ని వాటాగా పొందుతుంది. ఈ మోడల్, ప్రభుత్వ ఖర్చు లేకుండా టూరిజం అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది











