దేశ ప్రజలందరికీ కాల్స్ ఫ్రీ నినాదంతో జియో సంస్థను ప్రారంభించిన రిలయన్స్ సంస్థ.. కొంత కాలంపాటు ఈ నిబంధనకే కట్టుబడి ఉన్నాకూడా.. ట్రాయ్ నిబంధనల మేరకు కాల్స్, ఇంటర్నెట్కు ఛార్జీలు విధించింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది జియో కంపెనీ.

జనవరి 1 నుంచి అన్నీ వాయిస్ కాల్స్ ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఇక పై జియో నుంచి ఏ నెట్ వర్క్కు కాల్ చేయాలన్నా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. కానీ ఇంటర్నెట్ కావాలనుకునే వారు మాత్రం కంపెనీ అందించే రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెలకు 129 రూపాయలకు 2 జిబి డేటాను 28 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు. 24 రోజులపాటు.. రోజుకు 1జిబి డేటా కావాలనుకునే వారు 149 రూపాయలు రిఛార్జీ చేసుకుంటే సరిపోతుంది. 28 రోజులపాటు.. రోజుకు 1.5 జిబి కావాలనుకునే 199తో రిఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి నెల ఏం చేసుకుంటాం అనుకునే వారికి కూడా మరొక ఆఫర్ ప్రకటించింది జియో. 555 రూపాయిలతో రిఛార్జీ చేసుకుంటే 84 రోజులపాటు నిరాటంకంగా రోజుకు 1.5 జిబి డేటాను ఉపయోగించుకోవచ్చు. వావ్.. నిజంగానే సూపర్ ఆఫర్ కదా.. మరెందుకు ఆలస్యం.. జియో సిమ్ వెంటనే తెచ్చుకుని ఉచిత సేవల్ని పొందండి.











