పవన్ కళ్యాణ్ తో మళ్లీ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి డైరెక్టర్ హరీశ్ శంకర్ ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. పీకేతో సినిమాను తాను మళ్లీ ఓ రేంజ్ లో తియ్యబోతున్నాను అని హరీశ్ ఇస్తున్న స్టేట్మెంట్స్ అభిమానులకి పెద్దగా ఎక్కడం లేదు. హరీశ్ ఓవర్ యాక్షన్ మళ్లీ మొదలుపెట్టాడనే కామెంట్స్ పీకే ఫ్యాన్స్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే పీకే కూడా హరీశ్ కు సినిమా చేసుకోమని ఆఫర్ ఇచ్చాడు కానీ అది ఎప్పుడూ సెట్స్ మీదకి తీసుకువెళ్లాలి అనే స్పష్టత మాత్రం ఇవ్వలేదు. దీంతో హరీశ్ ఇప్పుడు మరో దారి చూసుకున్నాడు. తానే నిర్మాతగా మారి కామెడీ హీరో సునీల్ తో వేదాంతం రాఘవయ్య అనే సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఈ మూవీకి హరీశ్ శంకర్ స్టోరీ ఇస్తున్నాడు. ఇంకా డైరెక్టర్ కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. ఈ మూవీ స్టోరీ ప్రకారం హీరో కంటే విలన్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ఉంటాడట. అయితే ఆల్రేడీ విలన్ వేషాలు కోసం తాప్రయపడుతున్న సునీల్- ఈ ప్రాజెక్ట్ లో తనకి విలన్ రోల్ కూడా ఇవ్వమని హరీశ్ మీద ప్రెజర్ పెడుతున్నట్లుగా సమాచారం.
సాధారణంగా డ్యుయల్ రోల్ అంటే.. అన్న-తమ్ముడు, నాన్న-కొడుకు లాంటి పాత్రలు చేస్తుంటారు. రెండు రోల్స్ ఉంటే ఒకటి నెగటివ్ షేడ్ ఉంటే బాగుంటుందని కూడా అనుకుంటారు. కానీ.. వెరైటీగా సునీల్ మాత్రం.. అటు హీరో- ఇటు విలన్ రెండు పాత్రలూ తానే చేయాలని ఉబలాటపడడం చిత్రమే. మొత్తానికి హీరోయిన్ పాత్రకైనా వేరే ఎవరినైనా ఎంచుకుంటే బాగుంటుందని నెటిజన్లు జోకులేసుకునే పరిస్థితి వస్తోంది.
దీంతో హరీశ్, సునీల్ తో డబుల్ యాక్షన్ చేయించాలని ఫిక్స్ అయినట్లుగా తెలిసింది. ఆల్రేడీ గద్దలకొండ గణేశ్ లో వరుణ్ తేజ్ ని విలన్ గా చూపించి మంచి మార్కులు కొట్టేసిన హరీశ్ శంకర్ సునీల్ని విలన్గా ఎలా చూపించబోతున్నాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.