భారత్లో కరోనా కట్టడికి లుపిన్ ఫార్మా కంపెనీ ఓ అడుగు ముందుకు వేసింది.ప్రపంచంలోనే అత్యుత్తమ టీకాలుగా పేరున్న mRNA కరోనా టీకాలు తేవాలని లుపిన్ ప్రయత్నాలు ప్రారంభించింది.ఇప్పటికే ప్రపంచంలోని ఆరు ప్రముఖ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపారు.చర్చలు సఫలం అయితే ఇక మన దేశంలోనే లుపిన్ ఫార్మా,mRNA కరోనా టీకాలు తయారు చేయనుంది.ఈ సాంకేతిక పరిజ్ఙానంతో ఇప్పటికి మోడెర్నా,ఆస్ట్రాజెనికా మాత్రమే టీకాలు తయారు చేస్తున్నాయి.లుపిన్ ఫార్మా కూడా mRNA కరోనా టీకాల ఉత్పత్తి ప్రారంభిస్తే దేశంలో టీకాల కొరత చాలా వరకు తీరే అవకాశం ఉంది.మోడెర్నా,ఆస్ట్రాజెనికా కంపెనీలతోనూ లుపిన్ చర్చలు జరుపుతోంది.చర్ఛలు సఫలం అయితే mRNA కరోనా టీకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కీలక మందులు కూడా..
కరోనా చికిత్సలో విరివిగా వినియోగిస్తున్న రెమిడిసీవర్తో పాటు బాక్రిసిటివిబ్ మందులను కూడా లుపిన్ దేశీయంగా తయారు చేయనుంది.బాక్రిసటివిబ్ తయారు చేసేందుకు ఇప్పటికే ఎలీ లిల్లీ సంస్థతో ఒప్పందం చేసుకుంది.ఈ మందును రెమిడిసీవర్తో పాటు కరోనా రోగులకు వినియోగిస్తున్నారు.రాబోయే రెండు నెలల్లోనే ఈ మందును లుపిన్ అందుబాటులోకి తేనుంది.