సూపర్ స్టార్ రజనీకాంత్ .. ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్త మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేశ్, ఖుష్బూ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరో కీలకపాత్రను జగపతి బాబు చేస్తున్నారు. దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్ పిక్చర్స్ సంస్థ ప్రయత్నిస్తోంది.
‘అన్నాత్త’ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో 35 రోజుల షెడ్యూల్ ను జరుపుకుంది. ఇటీవల తలైవా తన పాత్రకు సంబంధించిన పోర్షన్ కంప్లీట్ చేసి.. చెన్నైకి ప్రయాణమయ్యారు. నేడు రజనీ చెన్నైలోని ఒక ఆసుపత్రిలో కోవిడ్ వేక్సిన్ సెకండ్ డోస్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తనయ సౌందర్యా రజనీకాంత్ తెలియచేశారు. మన తలైవర్ వేక్సిన్ వేయించుకున్నారు. మనం కోవిడ్ పై కలిసిపోరాడుదాం. అందరూ మాస్క్ ధరించండి .. క్షేమంగా ఉండండి అంటూ .. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు సౌందర్య.
Our Thalaivar gets his vaccine 👍🏻 Let us fight and win this war against Corona virus together #ThalaivarVaccinated #TogetherWeCan #MaskOn #StayHomeStaySafe pic.twitter.com/P8Gyca4zdF
— soundarya rajnikanth (@soundaryaarajni) May 13, 2021