దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాల్లో ‘పెళ్లి సందడి’ చాలా ప్రత్యేకమైనది. శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించిన ఈ 1996 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొన్నీమధ్య రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ మళ్లీ మొదలవ్వబోతోందని ఒక వీడియో రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యుడు గౌరీ రొనన్కి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ కొత్త ‘పెళ్లి సందడి’ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేస్తున్నాడని వార్తలు టాలివుడ్ లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈవార్తలను నిజం చేస్తూ తన సినిమాలో హీరో రోషన్ అంటూ అనౌన్స్ చేసారు దర్శకేంద్రుడు.
ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాఘవేంద్రరావు నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు హీరోయిన్ గా మాళవిక నాయర్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడు నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కళ్యాణ వైభోగమే’ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. మాళవిక నాయర్ అయితే ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుందని దర్శకుడు రాఘవేంద్రరావు ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే రోషన్, మాళవికల మీద ఫొటో షూట్, టెస్ట్ షూట్ కూడా జరిగాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కాగా త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని వెళ్లడించే అవకాశం ఉందని చిత్ర బృందం తెలిపింది. ఈవార్త నిజమైతే మాళవిక నాయర్ మంచి ఛాన్స్ అందుకున్నట్లే అని చెప్పాలి.