కరోనా ఎఫెక్ట్ కనుక పడకుండా ఉంటే స్వీటీ నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా మూడు నెలల క్రితమే థియేటర్స్లో సందడి చేసేది. గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వివిధ కారణాలు వల్ల వాయిదా పడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఇంతలోనే లాక్ డౌన్ రావడం తో నిశ్శబ్దం రిలీజ్ పై అంతా సైలెంట్ అయిపోయారు.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం తెరకెక్కింది. ఈ సినిమాలో అనుష్క తో పాటు మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, తదితరులు నటించారు.
కాస్టింగ్ బాగానే ఉండటంతో అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా నిర్మాతకు ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చి డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయాల్సిందిగా ప్రపోసల్ పెట్టారు. దాదాపుగా ఓ మూడు నెలలు నుంచి నిర్మాతకు, అమెజాన్ వారికీ ఈ సినిమా రైట్స్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిశ్శబ్దం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ఐపోతుంది అనే వార్తలు కూడా వినిపించడం మొదలు అయ్యింది. ఈ వార్తలను మొదట్లో ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ ఖండించినా ఆ తరువాత ఆయనే ఒక ఆన్ లైన్ పోల్ పెట్టడంతో ఇక నిశ్శబ్దం డిజిటల్ రిలీజ్ కు రంగం సిద్ధమైందని అనుకుంటున్నారు.
తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఇప్పటికే డీల్ ఫినిష్ చేసినట్టు చెబుతున్నారు. నిశ్శబ్దం డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియోకు 25 కోట్లకు అమ్మేసినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమాని డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేయడం అనుష్కకు యే మాత్రం ఇష్టం లేదట, దీంతో సినిమాను థియేటర్ రిలీజ్ చేయడం లేదు కాబ్బట్టి తాను ప్రమోషన్స్ కి రాను అన్నట్లు నిర్మాతలకు స్పష్టం చేసినట్లుగా ప్రస్తుతం ఓ టాక్ సినీ జనాలు మధ్య నడుస్తుంది.