స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరో మంచి పరిణామం జరగింది. కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషికి డిప్యూటీ కలెక్టరుగా శిక్షణ ఉత్తర్వులను.. ప్రభుత్వం తరఫున స్మితా సబర్వాల్ అందజేశారు. కొత్త విధుల్లో చేరేముందు.. సంతోషి.. తప్పనిసరిగా శిక్షణ పొందవలసి ఉంటుంది.
కల్నల్ సంతోష్ బాబు సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేసిన తర్వాత.. యావత్ దేశం వారి కుటుంబానికి సానుభూతి తెలిపింది. వారికి అండగా నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ నేపథ్యంలో కల్నల్ సంతోష్ బాబు సతీమణికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని ప్రకటించారు. సంతోష్ కుటుంబాన్ని ప్రగతి భవన్ కు ఆహ్వానించి.. వారితో కలిసి భోంచేసిన కేసీఆర్.. ఆ సమయంలోనే ఆమెకు నియామక పత్రాల్ని అందించారు.
దానికి సంబంధించి శిక్షణ ఉత్తర్వులను స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్మిత సబర్వాల్ అందించారు. వారి కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Today on the occassion of #IndependenceDay, Mrs Santoshi , wife of martyr Colonel Santosh Babu, has given her joining report to Government. She will undergo the mandatory training as Deputy Collector.
Salute your spirit👍. May you continue your family’s legacy. pic.twitter.com/MXVMT0Lnmc— Smita Sabharwal (@SmitaSabharwal) August 15, 2020










