ఏపీ సీఎంని తప్పుగా చూపించడానికి రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని ఎనర్జిటిక్ స్టార్ రామ్ వరుస కామెంట్లు చేస్తూ కలకలం రేపారు. “సీఎం గారు మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ,మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం” అంటూ రామ్ ట్వీట్ చేయడం అందరిని షాక్ కు గురి చేసింది. #APisWatching అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇదే సమయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రెండ్ అవుతున్న #HappyIndependenceDay అనే హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేసి అవునా అంటూ ప్రశ్నించారు. విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో రమేష్ హాస్పిటల్ నిర్వహిస్తున్న కరోనా సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి 10 మంది అగ్నికి ఆహుతైన ఘటన ఆగష్టు 9న జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురి స్టేట్మెంట్లను అధికారులు నమోదు చేశారు. రమేష్ హాస్పిటల్ ఎండీ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్ యజమాని ఇద్దరూ పరారీలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై టీడీపీ అధికారులు స్పందించలేదని దానిని వైసీపీ నాయకులు సామాజిక కోణంలో చూపే ప్రయత్నం చేశారు. దీంతో ఈ ఘటన అగ్ని ప్రమాదం కోణంలో నుంచి కుల సమీకరణంలోకి మారింది. రమేష్ హాస్పిటల్ ఓ సామాజిక వర్గానిదని, అక్కడ అత్యధిక బిల్లులు వసూలు చేస్తున్నారని వార్తలను ప్రచారం చేస్తున్నారు. కోవిడ్ లేకపోయినా రమేష్ హాస్పిటల్ యాజమాన్యం కరోనా సెంటర్ లో కొందరిని ఉంచిందని చనిపోయిన వారిలో కరోనా లేని వారు కూడా చనిపోయారని వార్తలు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో యంగ్ హీరో రామ్ అందరినీ ఫూల్స్ చేయడానికే అగ్ని ప్రమాద విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా? అంటూ ట్విట్టర్ సాక్షిగా ప్రశ్నించారు. ఫైర్ + ఫీజు = ఫూల్స్ అంటూ ఈ ఫీజులను రమేష్ హాస్పిటల్ నిర్ణయించలేదని రుజువులతో సహా పోస్ట్ చేశాడు. మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసిందని ఆయన తెలిపాడు. ఇదే సమయంలో ‘హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు?’ అంటూ ప్రశ్నించారు. రమేష్ హాస్పిటల్ ఎండీ రమేష్ బాబు తమకు తమ కుటుంబ సభ్యులకు ఓ ఆదర్శప్రాయుడని రామ్ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో నిమ్మగడ్డ విషయంలో కులకోణాన్ని ఏ ముఖ్యమంత్రి ప్రస్తావించని విధంగా ప్రస్తావించి విమర్శలెదురుకున్న జగన్ ‘రమేష్ హాస్పిటల్’ విషయంలో మాత్రం ఆ తప్పుచేయకుండా విచారణను సమర్థవంతంగా చేయాలని మేధావులు కోరుకుంటున్నారు.
పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి! @ysjagan garu.మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ,మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం🙏#APisWatching
— RAm POthineni (@ramsayz) August 15, 2020
ఫైర్ + ఫీజు = ఫూల్స్
అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా?
ఫీజుల వివరణ: మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది. #APisWatching pic.twitter.com/6TT1K2H4n2
— RAm POthineni (@ramsayz) August 15, 2020