తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపించడంతోపాటు,రోజూ వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకోవడంతో సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.ఏపీలో 3, తెలంగాణలో 6 స్థానాలకు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.ఏపీలో మే 31, తెలంగాణలో జూన్ 3తో మొత్తం 9 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది.అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ సీఈసీ స్పష్టమైన ప్రకటన చేయలేదు.
మద్రాసు హైకోర్టు ఎఫెక్ట్
కరోనా జనాలను చంపుతుంటే సీఈసీ ఎన్నికలు పెట్టిన తీరును మద్రాసు హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టిన సంగతి తెలిసిందే.సీఈసీపై హత్యానేరం కేసు పెట్టాలని,ఎన్నికల్లో బహిరంగ సభలకు అనుమతించి వేలాది మంది కరోనా బారినపడి చనిపోవడానికి సీఈసీ తీరే కారణమని మద్రాసు హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.దీంతో సీఈసీ అప్రమత్తమైంది.కరోనా సెకండ్ వేవ్ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు నిర్వహించే సాహసం చేయడం లేదు.











