బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుని భారత్ చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత టీమిండియాపై ప్రశంసల వర్షం కురిసింది. ఇదంతా ఓ ఎత్తైతే.. ప్రధాని మోదీ టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తారు. గబ్బా టెస్టులో చారిత్రక విజయం సాధించి టెస్టు సిరీస్ను గెలిచిన భారత జట్టును మోదీ మన్కీ బాత్లో కొనియాడారు.
“ఈ నెలలో క్రికెట్ నుంచి మనకో శుభవార్త వచ్చింది. ఆదిలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచింది. మన జట్టు కృషి, సమష్టి పోరాటం స్ఫూర్తిదాయకం” అని మోదీ ప్రశంసించారు.
మోదీ వ్యాఖ్యలపై బీసీసీఐ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ” ప్రేరణిచ్చే ఈ మాటలకు, ప్రశంసలకు ధన్యవాదాలు. త్రివర్ణ పతాకం అత్యున్నత ఎత్తులో ఎగరడానికి సాధ్యమైనంత వరకు పోరాడతాం” అని బీసీసీఐ ట్వీట్ చేసింది. మరోవైపు మోదీ మాటలను కోహ్లీ రీట్వీట్ చేస్తూ జాతీయ జెండాను పోస్ట్ చేశారు.