నా భర్త కన్నీరు వెనుక నాపై ఉన్న ప్రేమను తెలుపుతోంది ..!
నారా చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీ నారా భువనేశ్వరి సోమవారం తిరుపతిలో పర్యటించారు. తమ కంపెనీలో పనిచేసే వాళ్లు.. మగవాళ్ళు, మహిళలు గురించి మాట్లారని.. కేవలం కంపెనీ గురించి, సిఎస్ఆర్ ద్వారా చేయవలసిన సేవలు గురించే ప్రస్తావించుకుంటామని ఆమె వెల్లడించారు. అసెంబ్లీలో అధికార పార్టీ తనపై చేసిన విమర్శలకు తన భర్త చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్నారని, ఆ కన్నీరు వెనుక నా పట్ల ఆయకున్న ప్రేమను తెలియజేస్తోందని భువనేశ్వరి చెప్పారు. ఎవరి క్షమాపణ తనకు అవసరం లేదని, తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వారం, పది రోజులు తట్టుకోలేకపోయాను ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించ పరచడం సమాజానికి మంచిది కాదని, తనపై జరిగిన దాడి కంటే మహిళల పట్ల జరుగుతున్న దాడులే ఎక్కువ శాతం తనను ఆందోళనకు గురిచేస్తున్నాయని వాపోయ్యారు. ప్రతి ఒక్కరి ఇంట్లో తల్లి, చెల్లి ఉంటారని, వారికిచ్చే గౌరవాన్ని సమాజంలోని ప్రతి మహిళకు ఇవ్వాలని కోరారు.
ఎన్టీఆర్ ట్రస్ సేవలు దేశ వ్యాప్తంగా విస్తృతం ..!
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు దేశ వ్యాప్తంగా విస్తృతం చేయనున్నట్లు నారా భువనేశ్వరి మీడియాకు తెలిపారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆమె అనేక అంశాలను మీడియాతో పంచుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జాతీయ స్థాయిలో సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడ, ఎలాంటి ఆపద, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదుకునేందుకు ముందుటుందని చెప్పారు. చిత్తూరు, కడప, నెల్లూరు వరదల్లో మృతిచెందిన 48 మంది వరద బాధిత కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు సాయాన్ని భువనేశ్వరి అందించారు. ప్రతి ఒక్కరూ భూతాపాన్ని తగ్గించేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అసూయ ద్వేషం బదులు ప్రేమను కలిగి ఉండాలని సూచించారు. ఎన్టీఆర్ తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారని చెప్పారు. మన సంస్కృతి మూలాన్ని ఆయన ఏనాడు మరవలేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశయాలను, సేవలను సమాజంలోకి తీసుకుపోతున్న ట్రస్ట్ వలంటీర్స్ కు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.