అధికారం శాశ్వతం కాదు. పర్మనెంట్గా పవర్లో ఉండలేరు. కానీ ప్రజలకు చేసిన మేలు, అభివృద్ధి బాటలో వేసిన అడుగులు చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయి. సొంత లాభం కొంత మానుకొని, ప్రజల కోసం పాటు పడితే పదవులు వెతుక్కుంటూ వస్తాయి. ఇదే ఆలోచనతో తన పని తాను చేసుకుంటూనే.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన యువ నేత చింతకాయల విజయ్. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడుకి రాజకీయ వారసుడైనా.. స్వశక్తితో, సొంత ఇమేజ్తోనే పోలిటిక్స్లో పైకి రావాలని భావించారు విజయ్.
తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ, పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. జనాల్లో పేరు, పార్టీలో పలుకుబడి పెంచుకొని.. అనకాపల్లి ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్ధిగా ఎంపియ్యారు విజయ్. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కోసం విజయ్ చేస్తున్న కృషిని గుర్తించింది టీడీపీ హైకమాండ్. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వకూడదనే నియమాన్ని కూడా పక్కన పెట్టి చింతకాయల విజయ్కు ఎంపీ టికెట్ ఇచ్చారు పార్టీ అధినేత చంద్రబాబు. యువనేత నారా లోకేశ్ స్వయంగా ప్రజల సమక్షంలో చింతకాయల విజయ్ను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. వచ్చిన అవకాశాన్ని వినయంగా స్వీకరించారు విజయ్.
గతంలో అనకాపల్లి ఎంపీ సీటు నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వాళ్లలో ఎక్కువ మంది పార్టీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలోకి జంప్ చేశారు. ఈసారి అలాంటి జంపింగ్ జపాంగ్లు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చింతకాయల విజయ్తో పోటీ పడలేకపోయారు. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎన్ని కష్టాలు, మరెన్నో నష్టాలు భరించినా ఏనాడు సైకిల్ హ్యాండిల్ను వదల్లేదు విజయ్. ఆ నిబద్ధత, విధేయతలే ఈనాడు ఆయనకు కలిసొచ్చాయి. అనకాపల్లి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే జాతీయ స్థాయిలో నియోజకవర్గానికి పేరు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు జూనియర్ పాత్రుడు.
అనకాపల్లి బరిలోకి దిగడానికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ప్రజల్లోకి వెళ్లిపోయారు విజయ్. కోస్తా ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసిన మిగ్జాం తుపాను అనకాపల్లి తీరంలోనూ అలజడి సృష్టించింది. వర్షాలు, వరదలతో పంట నష్టపోయి, గూడు కోల్పోయి నిలువ నీడ లేకుండా పోయిన ప్రజలకు అండగా నిలిచారు. టీడీపీ తరఫున బాధితులకు సాధ్యమైనంత వరకూ సాయం చేసిన చింతకాయల విజయ్.. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించడానికి పోరాటం చేస్తున్నారు.
పార్టీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విశాఖలో జిల్లాలోకి ప్రవేశించిన రోజు నుంచి ఆయనతో పాటు నడుస్తున్నారు చింతకాయల విజయ్. జిల్లావ్యాప్తంగా పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో ఏం చేసినా వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చేశారు టీడీపీ అధనేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే.. అనకాపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే ఢిల్లీలో రాష్ట్రం కోసం బలమైన గొంతుకగా మారుతానని హామీ ఇస్తున్నారు చింతకాయల విజయ్. ప్రస్తుతం ఆయన చేస్తున్న పాదయాత్ర, త్వరలోనే విజయయాత్రగా మారాలని ఆకాంక్షిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు.











