జగన్ రెడ్డి పాలనను ప్రశ్నించినా.., నిరసన వ్యక్తం చేసినా వారిపై కక్ష్య సాధించడం పరిపాటిగా మారింది.
జగన్ రెడ్డి నాలుగునరేళ్ళ పాలనలో ప్రశ్నించిన వారిపై.., హక్కులపై పోరాడిన వారిపై ఉక్కుపాదం మోపి అణగదొక్కారు. ప్రజలు, విపక్షాలు, ఉద్యోగులు, ఉద్యమకారుల నుంచి గొంతు పెగిలితే నొక్కే ప్రయత్నం చేయడంలో జగన్ విజయం సాధించారు. ఈ తరహాలోనే అంగన్వాడీలపై కత్తికట్టి దాడులకు తెగపడుతోంది జగన్ రెడ్డి ప్రభుత్వం. 2019 ఎన్నికల హామీను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలను మూసివేసి.. నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలపై బెదిరింపులకు తెగపడుతోంది జగన్ రెడ్డి ప్రభుత్వం.
వివిధ సమస్యల పరిష్కారం కోసం.., డిమాండ్లు నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న సమ్మెను నీరుగార్చే దిశగా జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వేతనాలు పెంపు.., గ్రాట్యుటీ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్, అఖరి వేతనంలో 50 శాతం పెన్షన్ వంటి అనేక సమస్యల సాధనకు జగన్ ప్రభుత్వంపై అంగన్వాడీలు సమ్మె బావుట ఎగరవేశారు. గడిచిన నాలుగు రోజులుగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం పెద్దలు వారిపై బెదిరింపులు దిగుతున్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసే దిశగా కనీస ఆలోచన చేయకపోగా.. అంగన్వాడీల నిరసనలపై అణిచేవేసే దిశగా అడుగులు వేసోంది ప్రభుత్వం.
ఇదిలా ఉంటే అంగన్వాడీ కేంద్రాలపై సచివాలయం సిబ్బందిని పంపి.. మూసివేసిన కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి.., వాటిని అక్రమించుకోవాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించడం సైకో ఆరాచక పాలనకు పరాకాష్టగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసి ఉన్న అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలు కొట్టి మరి సచివాలయం సిబ్బంది వాటి స్వాధీనం చేసుకుంటున్న వైనం తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. సమ్మె డిమాండ్ల నెరవేర్చకపోగా బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నస్తున్నారు. గత ప్రభుత్వాల్లో ఎన్నడూ చూడని నిరంకుశత్వ విధానాలను జగన్ రెడ్డి పాలనలో చూడాల్సి వస్తోందని అంగన్వాడీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.











