తిరుపతి రూయా ఘటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఆక్సిజన్ కొరత ఉందని తెలిసినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని సామాన్య ప్రజలతో పాటు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజగా ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తిరుపతి రయా మరణాలన్నీ.. ముమ్మాటికీ జగన్ సర్కార్ చేసిన హత్యలేనని అన్నారు. ఆక్సిజన్ కొరత ఉందని తెలిసినా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు చనిపోతున్నా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కనీసం ఎందుకు ఇలా జరుగుతోందని ఆరా కూడా తీయడం లేదంటే, ప్రజల ప్రాణాలంటే ఎంత లెక్క లేనితనమో స్పష్టం అవుతోందని నారా లోకేశ్ అన్నారు.
ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆస్పత్రిలో సంభవించిన మరణాలు ముమ్మాటికీ @ysjagan సర్కారు చేసిన హత్యలే. అత్యంత ఆధునిక సౌకర్యాలున్న రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోయేంతవరకూ పట్టించుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతోంది. పది మందికి పైగా మృతిచెందారని తెలిసి షాక్ కి గురయ్యాను.(1/3) pic.twitter.com/BkOFshw9aa
— Lokesh Nara (@naralokesh) May 10, 2021











