నాయని నర్సింహారెడ్డి
జననం : 1944 మే 12
మరణం : 2020 అక్టోబరు 21
- నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము
- 1944 మే 12న నాయిని నర్సింహారెడ్డి జన్మించారు.
- నాయిని తండ్రి దేవారెడ్డి, తల్లి సుభద్రమ్మ
- నాయిని సోదరుడు మాధవరెడ్డి.. చెల్లెల్లు దమయంతి, సుధేష్న
- మేనమామ కూతురు అహల్యను వివాహమాడిన నాయిని
- నాయినికి కొడుకు దేవేందర్రెడ్డి, కూతురు సమతా రెడ్డి సంతానం
- పెద్దమునగల్, ఎడవెల్లిలో నాల్గవ తరగతి వరకు చదువుకున్నారు
- 5వ తరగతి నుంచి దేవరకొండలో విద్యాభ్యాసం సాగించారు.
- కుటుంబ బాధ్యతలతో హెచ్ఎస్సీ మధ్యలోనే ఆపేసిన నాయిని
- సొంతూరులో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న నాయిని
- సోషలిస్టు పార్టీకి ఆకర్షితులైన నాయిని
- సోషలిస్టు పార్టీ కేంద్ర నాయకులు రామ్ మనోహర్ లోహియా సారథ్యంలో పనిచేశారు.
- రాష్ట్ర నాయకుడు బద్రి విశాల్ పిట్టి మాటతో 1962లో హైదరాబాద్లో అడుగుపెట్టిన నాయిని
- సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా కొత్త బాధ్యతలు స్వీకరించారు.
- వెయ్యి మంది సభ్యులున్న మున్సిపల్ కార్మిక సంఘాన్ని ఐఎన్టీయూసీ నుంచి సోషలిస్టు పార్టీలోకి తీసుకురావడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు.
- 1969లో సోషలిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయిని
- 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నాయిని చాలా కీలకంగా వ్యవహరించారు.
- తొలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 30సార్లు జైలుకు వెళ్లారు.
- 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచారు
- ప్రముఖ నాయకుడు టి.అంజయ్యపై 3వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం
- ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో రూ.3 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు
- టీడీపీలో చేరాలని ఎన్టీఆర్ ఆహ్వానించినా నాయిని తిరస్కరించారు.
- 1983లో జనతాపార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి. 307 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గెలిచారు.
- 1984లో ఉపఎన్నికల్లో జనతాపార్టీ తరపున హిమాయత్నగర్ నుంచి ఓటమి
- 1985లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి 10,500 ఓట్ల మెజార్టీతో గెలుపు
- 1989లో జనతాదళ్ పార్టీ తరపున పోటీచేసి నాయిని ఓటమి
- 1995లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నుంచి మరోసారి నాయినికి ఆహ్వానం వచ్చింది. కార్యకర్తల ఒత్తిడితో టీడీపీలో చేరిన నాయినికి ముషీరాబాద్ టికెట్ లభించింది.
- పొత్తులో భాగంగా ముషీరాబాద్ టికెట్ కోసం బీజేపీ పట్టు పట్టింది. చంద్రబాబునాయుడు సనత్నగర్ నుంచి నాయినిని బరిలో దించాలనుకున్నారు. టీడీపీ ప్రతిపాదనను తిరస్కరించి నాయిని ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు.
- 2001లో కేసీఆర్ నుంచి నాయినికి ఆహ్వానం. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం. అప్పటినుంచి ప్రత్యేకరాష్ట్రంకోసం కేసీఆర్ తో కలిసి పనిచేశారు.
- 2004లో టీఆర్ఎస్ నుంచి ముషీరాబాద్లో పోటీ చేసి గెలిచారు.
- వైఎస్సార్ క్యాబినెట్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసిన నాయిని
- 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు