భద్రాది, ములుగు జిల్లాలో ఎన్నో ఆదివాసీలు గూడెలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఇంతవరకు ఒక్కరూ కూడా కరోనా బారిన పడలేదు. దానికి కారణం అడవిపై ఆధారపడటమే. నేచర్ తోమమేకమవుతూ హాయిగా బతకడమే. అడవుల్లో లభించే విప్ప పువ్వు, కాయలనే ఆహారంగా వాడుతారు. కూరగాయలు కూడా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించుకుంటారు. మాంసాహారం జోలికి పోకుండా ఆకు కూరలు, అడవిలో దొరికే వాటిని తినడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇక విందులు, వినోదాల కోసం గ్రామం కూడా దాటరు. అందుకే ఆ పల్లెలు అంటే కరోనాకు దడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, ఇల్లెందు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చర్ల, దుమ్ముగూడెంతో పాటు, ములుగు జిల్లాలోని గుత్తికోయలు, ఆదివాసీ పల్లెల్లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ప్రపంచమంతా కరోనాతో సహజీవనం చేస్తుంటే, ఈ పల్లెలు మాత్రం కరోనాకు సవాల్ విసరుతున్నాయి.
Must Read ;- మాస్కుతోనే అభయం : మాస్క్ పై ఆంజనేయుడి అవేర్ నెస్!











