కరోనా సేకండ్ వేవ్ పట్టణాలనే కాకుండా… పల్లెలనూ వణికిస్తోంది. మాస్కులు, వ్యక్తిగత పరిశుభ్రతకు చాలామంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలనే అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా ఐలాపూర్ గ్రామస్తులు వినూత్నంగా ఆలోచించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఐలాపూర్ గ్రామంలో ఆంజనేయుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో ఆ గ్రామస్తులు డిఫరెంట్ గా ఆలోచించి ఆంజనేయస్వామికి మాస్కును కట్టారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఆంజనేయస్వామి మాస్కు ధరించి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ‘మాస్క్ ధరించండి, కరోనాకు దూరంగా ఉండండి’ అనే సందేశం ఇస్తున్నాడు హనుమంతుడు. ఆంజనేయుడు మాస్క్ ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Must Read ;- డబుల్ మాస్క్తో కరోనాకు చెక్










