మొబైల్ కంపెనీ పోకో మన దేశంలో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్స్ ను ప్రారంభించింది. వీటి అమ్మకాలు శనివారం నుంచి ఆరంభమయ్యాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మూడు రకాల రంగులలో ఈ ఫోన్ లభించనుంది. బ్లూ, గ్రీన్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది. దీని మెమరీ సైజుని బట్టి ఈ ఫోన్ ధరను నిర్ణయించారు. ఈ ఫోన్ ధర 13,999 నుంచి ప్రారంభం కానుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఫోన్ ధర 13,999 కాగా 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 14,999గా నిర్ణయించారు. హై ఎండ్ 6 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 16,999గా ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
నాలుగు కెమెరాలతో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ ఆకర్షణీయంగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్క్రీన్ లెంగ్త్ యూజర్ కు అనువుగా ఉందని గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ ఫోన్ కు అదనపు బలమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో బాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తోంది. షియోమీ కంపెనీ తయారు చేసిన ఈ ఫోన్ ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. నో కాస్ట్ ఈఎంఐతో బాటు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు మీద ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు డిస్కౌంట్ లను కూడా అందిస్తున్నారు.