ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇందులో బన్నీ సరసన రష్మిక నటించింది. సమంత స్పెషల్ సాంగ్ లో నటించడం విశేషం. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అయితే.. ఈ సినిమా సౌత్ లో కంటే.. నార్త్ లో రికార్డ్ కలెక్షన్స్ సాధించడం విశేషం. పుష్ప చిత్రాన్ని నిర్మించిన మైత్రీ వాళ్లే కాదు.. అభిమానులు కూడా ఈ రేంజ్ సక్సస్ సాధిస్తుందని ఊహించలేదు.
ఈ చిత్రం బాలీవుడ్ లో భారీ వసూళ్లను రాబడుతూ తగ్గేదేలే అనేలా పుష్పరాజ్ తన హవా చూపిస్తున్నాడు. అక్కడ అంతగా ప్రచారం చేయకపోయినా.. ఇప్పటి వరకు బాలీవుడ్ లో పుష్ప ది రైజ్ 80 కోట్ల రూపాయల కి పైగా వసూలు చేయడం జరిగింది. ఆదివారం మరొకసారి 3.40 కోట్ల కి పైగా వసూలు సాధించడం తో 80 కోట్ల రూపాయలకి చేరడం విశేషం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.
అయితే.. బాలీవుడ్ లో 80కోట్ల మార్క్ ను అందుకోవడంతో పుష్ప 100 కోట్ల మార్క్ ను అందుకుంటుందా..? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కరోనా కారణంగా బాలీవుడ్ లో కొత్త సినిమాల రిలీజ్ లు లేవు. అందుచేత పుష్పకు బాగా కలిసొస్తుంది. ఈ రన్ ఇలాగే కొనసాగితే.. పుష్ప బాలీవుడ్ లో 100 కోట్ల మార్క్ ను అందుకోవడం ఏమంత కష్టం కాదు అంటున్నారు. ఇదే కనుక జరిగితే.. సంచలనమే.