‘సర్కార్ వారి పాట’ నీటమూటలని తేలిన వేళా..!?
సర్కార్ వారి పాట.. నీటమూటేనని తేలిపోయింది. అన్నొస్తున్నాడు వారంలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాడని వాడవాడల ప్రచారానెత్తుకున్నారు ఆ పార్టీ నాయకులు. గాలిలో గెలిచి నేడు నెత్తినెక్కి.. తొక్కుతున్నారు.. హక్కులను సైతం కాలరాస్తున్నారు. రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగుల సమస్య నేటికి ఒక్కొలిక్కి రాలేదు. అలానే గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. రెండేళ్లు ప్రొబిషన్ పిరియడ్ ను ముగించుకుని, ఆరు నెలలు కావస్తున్నా, వారిని పర్మినెంట్ చేయడానికి జగన్ రెడ్డి మొహం చాటేస్తున్నారు. సర్కారు కొలువలని నమ్మి చెరినందుకు రెండేళ్లు శిక్షణ కాలం ముగిసి, ఆరు నెలలు కావస్తున్నా.. నేటికి పర్మినెంట్ చేయడానికి ప్రభుత్వం విముఖ చూపుతోంది! రేపు మాపు అని చెప్పి కాలయాపన చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయం పరిథిలో ఉద్యోగులను గడిచిన 30 నెలలుగా అడ్డమైన చాకిరి చేయించుకుని నెలకు రూ.15,000 ఇచ్చి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. తక్కువ జీతంతో పై అధికారుల ఒత్తుళ్లును ఉద్యోగ భద్రత కోసం భరిస్తూ వస్తే.. నేడు అది నెరవేరని కల మాదిరిగా కనిపిస్తుంటే.. ఉద్యోగులకు కడుపు మండుతోంది. అందుకే మొన్న శనివారం ప్రభుత్వ ఉన్నతాధికారులు అడ్మిన్ గా ఉన్న వాట్సప్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. రోడ్డెక్కి నిరసన తెలిపారు. అలానే సోమవారం విధులను బహిష్కరించి నిరసన చేయాలని సచివాలయం ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు విధులు బహిష్కరించి, ఆందోళన బాట పట్టారు.
సచివాలయ ఉద్యోగులకు బెదిరింపులు..!
గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు నుంచి అనునిత్యం ఒత్తిళ్ల అన్నవి సర్వసాధరణంగా మారింది. ఒత్తిడితో కూడిన విధులను నిర్వర్తిస్తున్న కనీసం గౌరవం లేదు. అన్ని భరిస్తున్న సర్కార్ మాత్రం ఉద్యోగులను కనికరించకుండా చిన్నచూపు చూస్తోంది! ప్రొబేషన్ ప్రకటించకుండా ప్రభుత్వం అనేక శల్య పరీక్షలు పెట్టిందని ఉద్యోగులు వాపోతున్నారు. అప్రెంటిషిప్ పూర్తికాకముందే ప్రభుత్వం డిపార్ట్మెంట్ పరీక్ష పెట్టిందని, అంత గంధరగోళ పరిస్థితి నెలకొందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సచివాలం ఉద్యోగులపై ఉన్నతాధికారి స్థాయి వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, జాయింట్ కలెక్టర్లు ఒత్తిడికి గురిచేసి, విధుల్లో, వాటప్స్ గ్రూప్స్ లో చేరకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారని వాపోతున్నారు. ఎన్ని రకాల ఒత్తిళ్లుకు గురిచేసిన, సమస్యలను పరిష్కరించుకోవాడానికి 80 శాతం మంది ఉద్యోగులు నిరసన బాట పట్టారు. కరోనా వాక్సినేషన్ ప్రక్రియ ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. పలు పథకాలకు సంబంధించిన ప్రజా సేవలు స్తంబించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల ఉద్యోగులు సర్కార్ చర్యలకు ఆందోళన బాటపట్టారు.











