తనకు జరిగిన అన్యాయంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మినహా దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు ఇవాళ లేఖలు రాశారు.తనపై సీఐడీ అధికారులు విచక్షణారహితంగా ఎలా థర్డ్ డిగ్రీ ప్రయోగించిందీ,కాళ్లకు తగిలిన గాయాల ఫోటోలను సీఎంల లేఖలకు జత చేశారు. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వేయడం వల్లే తనపై కక్ష కట్టారని, అక్రమ కేసులు పెట్టి రాజద్రోహం కేసులు పెట్టి అరెస్టు చేయడంతో పాటు, సీఐడీ అధికారులు విచక్షణా రహితంగా కొట్టారని ఆ లేఖల్లో ఎంపీ వివరించారు.
ఇప్పటికే ఎంపీలకూ లేఖలు రాశారు
వైసీపీ ఎంపీలు మినహా దేశంలోని ఎంపీలందరికీ హిందీ, ఇంగ్లీషులో ఎంపీ రఘురామరాజు ఇప్పటికే లేఖలు రాశారు. తనపై పెట్టిన అక్రమ కేసులు,అరెస్టు తరవాత జరిగిన పరిణామాలను కూలంకుషంగా వివరించారు.దీనిపై ఇప్పటికే చాలా మంది ఎంపీలు స్పందించారు.ఎంపీపై దాడి చేయడం అంటే పార్లమెంటుపై దాడి చేసినట్టేనని కొందరు ఎంపీలు రఘురామరాజుకు మద్దతు పలికారు. తాజాగా సీఎంలకు కూడా లేఖలు రాయడంతో రఘురామరాజు వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
Must Read ;- ఎంపీని కొట్టడమంటే పార్లమెంట్ను అవమానించడమే.. రఘురామపై దాడిని ఖండించిన కేరళ ఎంపీ