విజయవాడలోని హోటల్ స్వర్ణప్యాలెస్ తో జరిగిన అగ్నిప్రమాదంపై హీరో రామ్ చేసిన ట్వీట్లపై పోలీసులు గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై నోరు మెదిపితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చిరంచారు. ఇంతకీ హీరో రామ్ ఎందుకిలా ట్వీట్లు చేశారో ముందు తెలుసుకుందాం. విజయవాడలోని రమోష్ హాస్పటల్స్ అధినేత రమేష్ హీరో రామ్ కు సొంత పెదనాన్న. నిర్మాత స్రవంతి రవికిశోర్, రామ్ తండ్రి, రమేష్… వీరు ముగ్గరూ అన్నదమ్ములు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ రమేష్ కుమార్తె కూడా తన తండ్రి గురించి నిన్న ఓ లేఖను విడుదల చేశారు.
ఇక హీరో రామ్ అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి వరుసగా ట్వీట్లు చేస్తూ వచ్చారు. అయితే రామ్ చేసిన ట్వీట్లు ముఖ్యమంత్రిని గానీ, ప్రభుత్వాన్ని గానీ కించపరిచేలా లేవు. ముఖ్యమంత్రి జగన్ ను తప్పుదోవ పట్టించడానికి కుట్ర జరుగుతోందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. రమేష్ హాస్పటల్ యాజమాన్యం అక్కడ కోవిడ్ సెంటర్ ఏర్పాటుచేయకముందు కూడా ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించిందని అన్నారు.
సీఎంని తప్పుగా చూపించడానికి మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం అనడం వల్ల సీఎం జగన్ మీద సదభిప్రాయంతోనే ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించినప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ? అన్న ప్రశ్నమాత్రమే కొంత ఇబ్బందికరంగా ఉంది. అయితే ఆ ప్రశ్న కూడా లాజికల్ గానే ఉంది. యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం నేరుగా బిల్లింగ్ చేసిందని ఆయన చెప్పారు. దాని వెనక కూడా పెద్ద కుట్ర జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
ఆ బిల్లింగ్ మాత్రం ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన కుట్రగా పేర్కొన్నారు. రామ్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సినిమాలు చేసుకునే రామ్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారో ఎవరికీ అర్థంకాలేదు. అయినా పోలీసులు దర్యప్తు జరిపే ఈ వ్యవహారంపై రామ్ స్పందించకుండా ఉండి ఉంటే బాగుండేదని పలువురు అంటున్నారు. ఈ వ్యవహారంలో తమకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్ కు కూడా నోటీసులు పంపకతప్పదని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు హెచ్చరించారు. స్వర్ణప్యాలెస్, దీనిపై హీరో రామ్ మరోసారి ట్విట్టర్ లో స్పందించారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ వివాదానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రకటనలు చేయబోనని స్పష్టం చేశారు.
I believe in Justice and im sure the real culprits will be punished no matter who they are.. related or not..I won’t be tweeting about this anymore as I’ve said all I had to..
Jai Hind! 🙏
— RAm POthineni (@ramsayz) August 16, 2020











