రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు గడవకముందే.. యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించే దిశగా అడుగులు పడ్డాయి.
ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యను చదువుతున్నా.., పూర్తైన విద్యార్ధుల కోసం తెలంగాణ ప్రభుత్వం జాతీయ స్ధాయిలో టెక్ రిలేటేడ్ కోర్సులను స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యువతలో నైపుణ్యాన్ని పెంచే దిశగా యూజీసీ ముందుకెళ్తోంది. అన్నీ కళాశాలలో ఈ స్వల్పకాల నైపుణ్య కోర్సులను ప్రారంభించుకునేందుకు అన్నీ ఏర్పాట్లును వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిపై మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. గత కొన్నెళ్ళుగా పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాల్లో నైపుణ్యమున్న యువత కొరత బాగా ఉంది. దీనిపై పరిశ్రమ వర్గాలు సైతం గత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా.. పట్టించుకున్న దాఖాలు లేవు.
సిక్స్ గ్యారెంటీ హామీల్లో భాగంగా .. యువత ఉపాధికి పెద్ద పీట వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇంటర్, డిగ్రీ, బీటెక్ పాసైన విద్యార్ధులకు 3 నుంచి 6 నెలల కాలంలో నైపుణ్య శిక్షణ కోర్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకుగానూ 27 కోర్పులను కూడా గుర్తించింది. అలాగే కోర్సులు పూర్తి చేసిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ.. కొన్ని సంస్ధలు.., పరిశ్రలతో ఒప్పందాలు కూడా చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సాంకేతిక సంబంధించి ప్రతి సబ్జెట్ ను ఈ శిక్షణలో చేర్చుతున్నారు. అలానే పరిశ్రమలకు అవసరమైన శిక్షణ కూడా జోడించారు. మొత్తంగా 27 కోర్సులను యువతకు అందించి.. జాతీయ స్ధాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇది త్వరలో కార్యరూపం దాల్చి యువతకు అందుబాటులోకి రానున్నది.
మరోవైపు ఏపీలో ఇదే స్కిల్ కిల్ చేసి.. యువత జీవితాలతో జగన్ రెడ్డి ఆటలాడుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కే ఆయా ప్రభుత్వాలు పెద్దపీట వేస్తుంటే.. జగన్ రెడ్డి మాత్రం యువత పెడదోవ పట్టించేలా మత్తును ప్రోత్సహిస్తూ.. యువతరాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నది విపక్షాల వాదనలు. మున్ముందు తెలంగాణలో ప్రవేశపెడ్డుతున్న స్వల్పకాల నైపుణ్య శిక్షణ కోర్సులు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఇప్పటికే విశ్లేషణలు ఊపందుకున్నాయి.