కరోనా వైరస్ రోగులతో హ్యూమన్ కాంటాక్ట్ నేరుగా లేకుండా సేవలందించేందుకు వాల్తేరు డివిజన్ అధికారులు రోబోను తయారు చేశారు. విశాఖపట్నంలోని రైల్వే ఆసుపత్రిలో రోబో సేవలందిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
COVID_19 రోగులకు సేవ చేయడానికి ఆసుపత్రి సిబ్బందికి సహాయపడటానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్కు చెందిన డీజిల్ లోకో షెడ్ ఈ రోబో ఆలోచనకు కార్య రూపాన్ని ఇచ్చింది.
కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తిని ఎదుర్కోవడానికి డీజిల్ లోకో షెడ్ ఇప్పటికే వివిధ వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు, డిఎల్ఎస్ రూపొందించిన రోబోను మిడి రోబో అని అని పిలుస్తారు. మెడికల్ వార్డుల నిర్వహణకు, రోగులకు అవసరమైన మందులు, ఆహారం అందించేందుకు, రోగుల సంరక్షణ లో సహాయపడేందుకు ఉపయోగపడనుంది. డివిజనల్ రైల్వే ఆసుపత్రిలో దీని సేవలు వినియోగించుకుంటున్నారు.
MeD ROBO విస్తృతమైన పరీక్షల అనంతరం ఆస్పత్రిలో ప్రవేశపెట్టారు. ఈ రోబో సహాయంతో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కరోనా వైరస్ సోకే ప్రమాదం లేకుండా సహాయపడుతుంది.

ఇది ఎలా పనిచేస్తుందంటే..?
MeD ROBO ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ద్వారా, కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ఇది వైఫై సౌకర్యం కూడా కలిగి ఉంది. ఈ రోబోలో అమర్చిన సెన్సార్స్ రోగుల శరీర ఉష్ణోగ్రతను గుర్తించి, అధిక ఉష్ణోగ్రతలు ఉంటే, అలారం ద్వారా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. MeD ROBOను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. రిమోట్ కంట్రోల్డ్ డ్రైవింగ్ యూనిట్, డేటా కార్డ్ సదుపాయంతో ఇంటరాక్టివ్ స్పీకర్ సౌకర్యంతో నైట్ విజన్ కెమెరా (2 MP HD) ను ఇందులో అమర్చారు. మోటారు, కెమెరా, డ్రైవింగ్ కోసం 1 KVA బ్యాకప్ అనుసంధానం చేశారు.
వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ మార్గదర్శకత్వంలో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ (డీజిల్) సంతోష్ కుమార్ పాత్రో ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యూనిట్ విశాఖపట్నం డీజిల్ లోకో షెడ్ లో అసింబల్ చేశారు. వివిధ పరీక్షల అనంతరం విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే ఆసుపత్రికి అందజేశారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ లోకో షెడ్ అధికారులు రూపొందించిన రోబో











