కన్నడ ప్రముఖ నటుడు శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరోగా నటిస్తుండగా..“ఉండిపోరాదే`’ చిత్రం ఫేమ్ అనువర్ణతో పాటు తమిళ నటి చాందిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. మర్మం, ‘కనులు కలిసాయి`వంటి ఐదు లఘు చిత్రాలను రూపొందించిన సతీష్ మాలెంపాటి ఈ చిత్రం ద్వారా వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, కన్నడ, తమిళం వంటి మూడు భాషల్లో విభిన్నమైన థ్రిల్లర్గా దీనిని మలుస్తున్నామని దర్శకుడు సతీష్ మాలెంపాటి వెల్లడించారు.
ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఈ నెల 23 నుంచి మొదలు కానుంది. రెండు గంటల పాటు ట్విస్ట్లు, మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీస్తున్నాం. ఛేజింగులు, యాక్షన్ సీన్లతో ఒక చక్కటి థ్రిల్లర్ చూసిన అనుభూతిని కలిగిస్తుంది“ అని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో రవివర్మ, పోసాని కృష్ణ మురళి, రవికాలే, శ్రావణ్,బ్లాక్ పాండీ, కేపివై బాలా, శంకర్ మూర్తి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి..సినిమాటోగ్రఫి: సతీష్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్: బి. నాగేశ్వర రెడ్డి, ఆర్ట్: మురళి, నిర్మాణం: అరుణం ఫిలింస్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సతీష్ మాలెంపాటి.
Also Read: tollywood-director-anil-ravipudi