వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళతాడా..? లేదా.?? అనే అంశంపై ఏపీలోని రాజకీయపార్టీలలో ఎలాంటి అభిప్రాయం ఉందో పక్కనపెడితే, సొంత పార్టీ నేతలు మాత్రం ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని దాదాపు ఫిక్స్ అయ్యారు.. తాజాగా ఆ పార్టీ కరపత్రిక, విషపుత్రికగా భావించే సాక్షి చానెల్కి ఇంటర్ వ్యూ ఇచ్చారు వైసీపీ సీనియర్ నేత, మాజీ సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఈ ఇంటర్ వ్యూలో జగన్.. జైలుకి వెళ్లడం ఖాయం అనేలా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు..
జగన్ జైలుకి వెళితే పార్టీకి జరిగే డ్యామేజ్ ఏమీ ఉండదని, గతంలో జగన్ జైలుకి వెళ్లిన సమయంలో పార్టీని అద్భుతంగా నడిపించామని వివరించారు సజ్జల.. జగనన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీ కీ బలం లేదు. అప్పుడే పార్టీ చాలా అద్భుతంగా నడిపించాం. ఇప్పుడు చాలా బలంగా ఉంది పార్టీ నడిపించడం పెద్ద లేక్కేమీ కాదని విశ్వాసం వెలిబుచ్చారు సజ్జల.. జగన్ని మహా అయితే 45 రోజులు లేదంటే రెండు నెలలు జైలులో వేస్తారని, ఆ తర్వాత బయటకు వస్తారని ముందే ఓ అంచనాకి వచ్చారు సజ్జల..
ఇది ఆయన ఒక్కడి అభిప్రాయమా..? లేక, వైసీపీ నేతలందరి అభిప్రాయమో తెలియదు కానీ, సజ్జల చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది.. జగన్కి అత్యంత విశ్వాసపాత్రుడు, ఆయనకి మిత్రుడు, బిజినెస్ పార్టనర్గా ముద్రపడిన ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో, దీనిపై ధర్నాలు, నిరసన దీక్షలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.. కానీ, ఒక్కరు కూడా బయటకు రాలేదు.. మిధున్ రెడ్డి తప్పు చేశారని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారనే చర్చ జరిగింది.. ఇక, జగన్ రెడ్డి అరెస్ట్ అయినా, సీన్ ఇదేలా ఉంటుందని తాడేపల్లి ప్యాలెస్లో వణుకు మొదలయింది.. అందుకే, పార్టీ కేడర్ని భరోసా కల్పించేందుకు, జగన్ని ఎక్కువ రోజులు జైలులో ఉంచరని ఓ అభిప్రాయాన్ని కలుగజేసేందుకే సజ్జల తాపత్రయపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..
మరోవైపు, లిక్కర్ స్కామ్లో జగన్ అవినీతి చేయలేదని, ఆయనకి మరక అంటలేదని ఏ ఒక్కరూ భావించడం లేదు.. ఆయన చేసిన కరప్షన్.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.. ఇండియాలోని స్కామ్స్లలో ఏపీ లిక్కర్ స్కామ్కి టాప్ ప్లేస్ దక్కడం ఖాయం.. ఈ విషయం తాడేపల్లి ప్యాలెస్లోని అధినాయకత్వానికి తెలుసు.. అందుకే, జగన్ జైలుకి వెళ్లడం ఫిక్స్ అని ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.. ఎప్పుడు వెళతాడు.. అనే అంశంపైనే వారికి క్లారిటీ రావడం లేదట..
గతంలో జగన్ జైలుకి వెళ్లినప్పుడు ఆయనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలు వేరే.. నాడు ఆయన గతంలో ఆయన ప్రభుత్వంలో లేరు. నేడు ఆయన స్వయానా ముఖ్యమంత్రిగా ఈ స్కామ్ని ముందుండి నడిపించారు.. ఆయనకు ఏ మేరకు వాటాలు వెళ్లాయో అనేది కూడా సిట్కి దాదాపు కీలక ఆధారాలు లభించాయని తెలుస్తోంది. మరి, జగన్ రెండు నెలలలో ఎలా బయటకు వస్తారు.?? పార్టీని నడిపించడం ఈజీ అని సజ్జల ఎలా ఫిక్స్ అయ్యారో అర్ధం కావడం లేదు.. నాడు జగన్ జైలులో ఉన్నా, పార్టీని లైవ్లో ఉంచడానికి ఆయన సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మి ఉన్నారు. నేడు ఎవరు ముందుండి కీలక బాధ్యతలు తీసుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. అందుకే, నాడు – నేడు.. బోత్ ఆర్ నాట్ సేమ్ సజ్జల అని చెబుతున్నారు రాజకీయ పండితులు.. మరి, సజ్జల ఏ నమ్మకంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారో ఆయనకే తెలియాలి..











