రాష్ట్రంలో అత్యధిక ఆర్థికపుష్టి కలిగిన విజయనగరం ‘మాన్సాస్’లో రోజుకో అలజడి చోటుచేసుకుంటోంది. వైసీపీ అధికారం చేపట్టిన కొన్నినెలలకే ఆగమేఘాల మీద మాన్సాస్ ఛైర్పర్సన్గా సంచైత గజపతిరాజును నియమించారు. ఆమె నియామకమే చెల్లదంటూ మాన్సాస్ పూర్వ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రి అశోకగజపతి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు ఉంటుండగానే సంచైత మాన్సాస్కు అంతా తానే అన్నట్టు తన పని తాను చేసుకుపోతున్నారు. రోజుకొక నిర్ణయం తీసుకుంటూ అలజడి సృష్టిస్తున్నారు.
ప్రఖ్యాత ఎం.ఆర్. కళాశాల ప్రైవేటీకరణకు ప్రణాళిక
భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన విజయనగరం మహారాజా అటానమస్ కళాశాలను ప్రైవేటీకరించేందుకు మాన్సాస్ నిర్ణయించింది. ఈ మేరకు మాన్సాస్ యాజమాన్యం ఇచ్చిన అభ్యర్థనను పరిశీలించమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆర్జేడీని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్యడంతో అసలు విషయం బయటపడింది. మంచి ఆర్ధిక పరిపుష్టి కలిగి, ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న కళాశాలను ఉన్నపళంగా ప్రైవేటీకరించే ఆలోచన ఎందుకు వచ్చిందని స్థానికులు మాన్సాస్ యాజమాన్యంపై విరుచుకు పడుతున్నారు.
కళాశాలది ఘనచరిత
ఈ కళాశాల విజయనగరం మహారాజు పూసపాటి విజయరామ గజపతి చే స్థాపించబడింది. ఇది మాధ్యమిక పాఠశాలగా 1857లో ప్రారంభించబడి 1968 నాటికి ఉన్నత పాఠశాలగా మారింది. 1879లో కళాశాల స్థాయికి ఎదిగినది. గ్రాడ్యుయేషన్ తరగతులు 1881 నుండి పూసపాటి ఆనంద గజపతి రాజు గారి నేతృత్వంలో ప్రారంభించారు 1948లో రాజ సాహెబ్ పి.వి.జి.రాజు తన రాజ భవనాన్ని కళాశాలకు దానం చేసారు.
1958 లో “మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్” (మాన్సాస్) అనేది ఉనికిలోకి వచ్చింది. 1995 నవంబరు 13న పి.వి.జి.రాజు మరణించారు. అతని కుమారుడు పూసపాటి ఆనంద గజపతి రాజు చైర్మన్ గా, పూసపాటి అశోక్ గజపతి రాజు వైస్- చైర్మన్ గా భాద్యతలు తీసుకున్నారు. 1987లో ఈ కళాశాలకు స్వయం ప్రతిపత్తి వచ్చింది.
పురాతనమైన కళాశాల.
భారతదేశంలో అతి పురాతనమైన ఈ కళాశాలను “నేషనల్ అక్రెడిటేషన్, అసెస్మెంట్ కౌన్సిల్” “బి” గ్రేడుగా గుర్తించింది. ఈ కళాశాలలో 21 విభాగములు ఉన్నాయి. ఈ కళాశాలలో 19 వివిధకరములైన గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నవి. ఈ కళాశాలలో సుమారు 150 మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు కలరు. 4వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం యుజిసి నిధులతో కళాశాల నిర్వహణ , మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది.
మేలైన మౌలికసౌకర్యాలు
మహారాజా కళాశాల 18 ఎకరాల విస్తీర్ణంతో, 115,307 sq ft (10,712.4 m) వైశాల్యంలో ఆరు భవనాలతో ఉంది. అందులో 51 తరగతి గదులున్నాయి. 21 ప్రయోగశాలలు, 10 బోధనా సిబ్బంది గదులు ఉన్నాయి. ఒక ప్రధాన గ్రంథాలయంతో పాటు 14 ఇతర విభాగాల గ్రంధాలయాలు కూడా ఉన్నాయి. ప్రధాన గ్రంథాలయంలో 50,000 పుస్తకాలు, 20 కంప్యూటర్లు (ఇంటర్నెట్ సదుపాయంతో) ఉన్నాయి. రెండు సెమినార్ గదులు, ఒక వైద్య కేంద్రం ఉన్నాయి. బాలుర వసతి గృహం కళాశాల పరిధిలో ఉంది. విశాలమైన ఆటస్థలం ఉంది. అక్కడ వాలీబాల్, బాస్కెట్ బాల్, కబాడ్డీ, ఖో-ఖో, బాల్ బాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, ఫుట్ బాల్, హాకీ వంటి ఆటలు ఆడటానికి సదుపాయాలు ఉన్నవి. ఇండోర్ గేమ్స్, జిమ్నాసియం సదుపాయాలున్నాయి. కళాశాల సిబ్బంది, విద్యార్థుల అవసరాలను తీర్చడానికి ఆంధ్రా బ్యాంకు శాఖ కూడా ఉంది.
మహోన్నతులు ఇక్కడ విద్యార్థులు
ఈ కళాశాల పూర్వవిద్యార్థులు మహోన్నతులుగా వెలిగారు. వెలుగొందుతున్నారు. వారిలో విజయనగరానికి చెందిన ప్రస్తుత రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. ఇంకా …..
ప్రొ. అల్లం అప్పారావు, Vice Chancellor of Jawaharlal Nehru Technological University, Kakinada.
Dr. A. L. Rao, Chief Operating Officer, Wipro
Prof. Beela Satyanarayana, Vice Chancellor of Andhra University.
చాగంటి సోమయాజులు, Telugu writer.
ద్వారం భావనారాయణరావు, musicologist and Principal of Maharajah’s Government College of Music and Dance.
Dr. D. N. Rao
Justice E. Venkatesam, former Judge of Andhra Pradesh High Court.
Justice G. Ramanujulu Naidu, former Judge of Andhra Pradesh High Court.
గంటి జోగి సోమయాజి, Telugu scholar and faculty in Andhra University.
Ganti Prasada Rao, electrical engineering and systems science scholar, researcher and academician.
గిడుగు వెంకట రామమూర్తి, వ్యవహార భాషోద్యమానికి శ్రీకారం దిద్దిన రచయిత
గురజాడ అప్పారావు, సుప్రసిద్ధ రచయిత.
రాజశ్రీగా పేరుగాంచిన ఇందుకూరి రామకృష్ణంరాజు, సినీ మాటల, గేయ రచయిత
జె. వి. సోమయాజులు, నటుడు
Justice కె.పున్నయ్య, former Judge of Andhra Pradesh High Court and Member of Legislative Assembly.
Dr. K. S. R. Krishna Rao
మేజర్ జనరల్ కె. వి. కృష్ణారావు, Chief of Indian Army.
కళా వెంకటరావు, freedom fighter and politician.
కందాల సుబ్రహ్మణ్యం, lawyer and Member of Parliament from Vizianagaram constituency.
కొచ్చర్లకోట రంగధామరావు Indian Physicist.
V. Narayana Rao, Chief of Crime Investigation Department.
Dilip Kumar, Chief of Anti-Corruption Branch.
న్యాయపతి కామేశ్వరి better known as Radio Akkayya.
L. N. Raju
పి. వి. రమణయ్య రాజా, founder of Sri Raja-Lakshmi Foundation.
Major General P. V. Ramanaiah
Pappu Venugopala Rao, musicologist.
Justice పెనుమత్స సత్యనారాయణ రాజు former Chief Justice of Andhra Pradesh High Court.
పులపాక సీతాపతిరావు, CEO of State Bank of Hyderabad during 1965-70
Justice T. V. R. Tatachari, Chief Justice of Delhi High Court.
R. Panthulu
వసంతరావు వేంకటరావు, Physics teacher
ఇటువంటి చారిత్రక ఘనత , ప్రసిద్ధి గాంచిన చరిత ఉన్న ఈ కళాశాలను ప్రైవేటీకరించాలనేది ఒక మోసపూరిత కుట్రగా స్థానికులు అభివర్ణిస్తున్నారు.