Senior Couple In Hyderabad Filling Potholes On Roads With Pension Funds :
హైదరాబాద్ అనగానే పెద్ద పెద్ద ఫ్లై ఓవర్లు, విశాలమైన రోడ్లు గుర్తుకొస్తాయి. కానీ రహదారుల మాటున ప్రమాదాలు సైతం పొంచి ఉంటాయి. చిన్న చిన్న గుంతలు, గోతులు ఉండటమే అందుకు కారణం. అస్తవ్యస్తమైన రోడ్లపై జనాలు ప్రయాణిస్తూ తమ విలువైన ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. పాలకులు, అధికారులు ‘చిన్న గుంతే కదా’ అని లైట్ గా తీసుకుంటున్నారు. కానీ ఈ వృద్ధ దంపతులు మాత్రం మనకెందుకెలే అని అనికోరు. చూసీ చూడనట్లు అసలు ఉండరు. ఎక్కడైనా గుంత కనిపిస్తే.. కారు ఆపి ఆ గుంతను పూడ్చేదాక కానీ అక్కడి నుంచి వెళ్లరు.

2,030 గుంతలను పూడ్చి
గంగాధర్ తిలక్, వెంకటేశ్వరీ దంపతులు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడటం.. జనాలు ప్రమాదాల బారిన పడటంతో గుంతలు పూడ్చాలనుకున్నారు. తమకున్నకారును సైతం రోడ్డు మరమ్మతులకే కేటాయించారు. కారు వెనుక భాగంలో తారు, సిమెంట్, పలుగు, పార ఉంటాయి. గుంత కనిపిస్తే చాలు.. వెంటనే కారు ఆపి దానిని పూడ్చేస్తారు. ఇప్పటి వరకూ దాదాపు 2,030 గుంతలను పూడ్చారు. ఒక్కోగుంత పూడ్చడానికి కనీసం రూ.2 వేల వరకూ ఖర్చు పెడతారు. తమకు వచ్చే ఫించన్ డబ్బులనే రోడ్లను బాగు చేసేందుకు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఇంట్లో విశాంత్రి తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ దంపతులు రోడ్లపై గుంతలను పూడుస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

జీహెచ్ఎంసీ పై హైకోర్టు ఆగ్రహం
రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ దంపతులకు సంబంధించిన కథనాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దీనిపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. రోడ్లపై ఆ వృద్ధ దంపతులు గుంతలను పూడస్తుంటే.. జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. వృద్ధ దంపతులు గుంతలు పూడుస్తుంటే.. సిగ్గుగా అనిపించడం లేదా అని మొట్టికాయలు వేసింది. జీహెచ్ఎంసీ అధికారుల జీతాలు.. వృద్ధ దంపతులకు ఇవ్వాలని నిలదీసింది.
Must Read ;- జగన్ గారు.. ఈ ‘చెత్త’ మీద పన్నులేంటి..?












