చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘కోబ్రా, ధ్రువ సక్షత్రం’ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో గౌతమ్ మీనన్ ‘ధ్రువ నక్షత్రం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ హీరో ఇప్పుడు తన కెరీర్ ను గాడిలో పెట్టుకొనే పనితోపాటు.. తన కొడుకు ధ్రువ్ విక్రమ్ ను హీరోగా నిలబెట్టే బాధ్యతను కూడా చేపట్టారు. ఇక విక్రమ్ కు అక్షిత అనే కూతురు కూడా ఉంది. 2017 లో ఆమెకు వైభవంగా వివాహం చేశారు విక్రమ్. వరుడు మను రంజిత్ తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి మునిమనవడు అవుతాడు. ఈ దంపతుల వైవాహిక జీవితానికి అప్పుడే మూడేళ్ళయింది.
కాగా అక్షిత తమిళనాడులోని ప్రముఖ ఆసుపత్రిలో ముద్దులొలికే ఆడబిడ్డ కు జన్మనిచ్చింది. దాంతో విక్రమ్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. ఆయన ఇంట మరో పాప అడుగుపెట్టడం అభిమానుల్ని ఆనందపరుస్తోంది. మొన్నామధ్య విక్రమ్ తనయుడు ఆదిత్య వర్మ తో సూపర్ హిట్టందుకోగా.. విక్రమ్ పుత్రోత్సాహంతో మురిసిపోయాడు. ఇప్పుడు మనవరాలు వారింట అడుగుపెట్టడంతో మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.