వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత దారుణ హత్య..!
పల్నాడులోని పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్ పంజా విప్పుతోంది. మాచర్ల నియోజకవర్గం పరిధిలో అధిపత్యపోరు తారస్థాయికి చేరింది. అటవీక సాంప్రదాయాలు నేటికి ఇక్కడ రాజ్యమేలుతునే ఉన్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి నేతృత్వంలో రౌడీ రాజకీయం పెచ్చురిల్లుతోంది అన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదేక్కడి అనాగరిక చర్యలోకానీ.. ప్రశ్నిస్తే దాడులు, వినకుంటే హత్యలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య ను ఊరి నడిసెంటర్లో అత్యంత దారుణంగా నకిరి చంపారు. ఫ్యాక్షన్ హత్యలకు పవిత్ర దినాలంటూ ఏమి ఉండవు అన్నట్లు పల్నాడులో టీడీపీనేత హత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది! చంద్రయ్య హత్యపై టీడీపీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్, రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. మధ్యాహ్నం 2 గంటలకు గుండ్లపాడుకు చంద్రబాబు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రయ్య మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
టీడీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే..
టీడీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇటువంటి దారుణాలకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వడిగడుతున్నారని టీడీపీ నేత, మాచర్ల ఇంఛార్జీ జూలకంటి బ్రహ్మరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటి అధికారపార్టీ చేసిన హత్యేనని ఆరోపించారు. అయితే గత ఏడాది డిసెంబర్ లో మాచర్ల నియోజకవర్గానికి జూలకంటి బ్రహ్మరెడ్డిని టీడీపీ ఇంచార్జీగా పార్టీ అధినేత చంద్రబాబు నియమించాడు. అప్పటి నుంచి రాజుకున్న రాజకీయ వేడి.. నిత్యం రగులుతూనే ఉంది. టీడీపీ ఫ్లెక్సీలు చింపి గొడవులకు ఆజ్యం పోశారు. నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతకు యత్నం, ఆ క్రమంలో నిరసన తెలిపేందుకు వస్తున్న జూలకంటి బ్రహ్మరెడ్డి అరెస్ట్ వంటివి చర్యలకు పాల్పడి అధికార మదాన్ని బయపెట్టారు. గురువారం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య ను అత్యంత కిరాతంగా గొడ్డళ్లతో నరికి చంపి.. ఇక్కడ తాను చెప్పిందే ఫ్యాక్షన్ వేదం అని మరోసారి చాటిచెప్పింది అధికార పార్టీ!











