ఏపీ అసెంబ్లీ ఎలాంటి చర్చ లేకుండానే పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు చర్చకు డిమాండ్ చేశారు. చర్చ లేకుండానే అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలపడంతో టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.- పంచాయతీరాజ్ బిల్లుకు సంబంధించి చట్టంలో ఇంతకు ముందే సవివరంగా చర్చ జరిగిందని, అసెంబ్లీలో చర్చ పూర్తయ్యాకే బిల్లును మండలికి పంపించామని స్పీకర్ తమ్మినేని గుర్తుచేశారు. మండలిలో కొన్ని సవరణలతో ఆమోదం పొందిన బిల్లు, మరలా అసెంబ్లీకి వచ్చిందని గుర్తుచేశారు. ఈ బిల్లుపై ఇప్పటికే సుదీర్ఘ చర్చ జరిగిందని, మరలా చర్చ జరపాలని ప్రతిపక్షం కోరడం సరికాదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో తెలిపారు.
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై మరలా చర్చించాలంటూ విపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేశారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చించకుండా ఆమోదించినందుకు నిరసనగా టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.